పాట‌ల‌తో ప‌గ తీర్చుకుంటున్న జొన్న విత్తుల‌

టీవీ ఛాన‌ళ్ల డిబేటులో వ‌ర్మ – జొన్న విత్తుల ఎపిసోడ్ ఓ రేంజులో న‌డిచింది. ఇద్ద‌రూ సై అంటే సై అంటూ వాదించుకున్నారు. ఆ వాద‌న‌లో కొన్నిసార్లు వ‌ర్మ‌ది పై చేయి అయితే, ఇంకొన్నిసార్లు జొన్న‌విత్తుల‌ది పై చేయిగా మారింది. ఆనాడే `నీపై సినిమా తీసి.. నువ్వేంటే ఏమిటో జ‌నాల‌కు చూపిస్తా` అంటూ శ‌ప‌థం చేశారు జొన్న‌విత్తుల‌. అనుకున్న‌ట్టే `ఆర్‌జీవి` (రోజూ గిల్లే వాడు) అనే పేరుతో ఓ సినిమా మొద‌లెట్టారు. ఇప్ప‌టికి రెండు పాట‌ల్ని విడుద‌ల చేశారు. `ఓడ్కా మీద ఒట్టు.. నేబ‌డ్క‌వ్ నా కొడుకుని` అంటూ.. తొలి పాట విడుద‌ల చేశారు. ఈ పాట సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు రెండో పాట వ‌దిలారు.

`ద‌య్యంతోనే అన్నీ చేయాల‌నుకుంటాడే వీడు
క‌ల్లోకొచ్చిన కాష్మోరాతో కక్కుర్తి ప‌డ‌తాడు` అంటూ వ‌ర్మ దెయ్యాల్నీ వ‌ద‌ల‌డు అనే రేంజులో పాట రాశారు. తొలి పాట‌లో వ‌ర్మ నైజాన్ని బ‌య‌ట‌పెడితే, రెండో పాట‌లో.. వ‌ర్మ‌లోని దాదాపు అన్ని `యాంగిల్స్‌`నీ బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ రెండు పాట‌ల్నీ రాసింది జొన్న విత్తులే.

సృష్టిలో వీడంత శృంగార ద్రోహి ఎవ‌డూ లేడు
ఎగ్సార్సిస్టుకి రిబ్బ‌న్ క‌ట్టి ఎక్స్‌పోజ్ చేస్తాడు
క‌సిలో ఖ‌రుడు
మ‌స‌లి జ‌డుడు
సెక్సోన్మాదుడు
దుష్‌బ్ర‌స్టుడు… అంటూ… ఏ రేంజులో ఆడుకున్నాడు. ఇలాంటి పాట‌లు ఇంకో రెండున్నాయట ఈ సినిమాలో. మొత్తానికి జొన్న విత్తుల వ‌ర్మ‌పై రివైంజ్ తీర్చుకోవ‌డానికి బాగానే ప్రిపేర్ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close