పాట‌ల‌తో ప‌గ తీర్చుకుంటున్న జొన్న విత్తుల‌

టీవీ ఛాన‌ళ్ల డిబేటులో వ‌ర్మ – జొన్న విత్తుల ఎపిసోడ్ ఓ రేంజులో న‌డిచింది. ఇద్ద‌రూ సై అంటే సై అంటూ వాదించుకున్నారు. ఆ వాద‌న‌లో కొన్నిసార్లు వ‌ర్మ‌ది పై చేయి అయితే, ఇంకొన్నిసార్లు జొన్న‌విత్తుల‌ది పై చేయిగా మారింది. ఆనాడే `నీపై సినిమా తీసి.. నువ్వేంటే ఏమిటో జ‌నాల‌కు చూపిస్తా` అంటూ శ‌ప‌థం చేశారు జొన్న‌విత్తుల‌. అనుకున్న‌ట్టే `ఆర్‌జీవి` (రోజూ గిల్లే వాడు) అనే పేరుతో ఓ సినిమా మొద‌లెట్టారు. ఇప్ప‌టికి రెండు పాట‌ల్ని విడుద‌ల చేశారు. `ఓడ్కా మీద ఒట్టు.. నేబ‌డ్క‌వ్ నా కొడుకుని` అంటూ.. తొలి పాట విడుద‌ల చేశారు. ఈ పాట సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు రెండో పాట వ‌దిలారు.

`ద‌య్యంతోనే అన్నీ చేయాల‌నుకుంటాడే వీడు
క‌ల్లోకొచ్చిన కాష్మోరాతో కక్కుర్తి ప‌డ‌తాడు` అంటూ వ‌ర్మ దెయ్యాల్నీ వ‌ద‌ల‌డు అనే రేంజులో పాట రాశారు. తొలి పాట‌లో వ‌ర్మ నైజాన్ని బ‌య‌ట‌పెడితే, రెండో పాట‌లో.. వ‌ర్మ‌లోని దాదాపు అన్ని `యాంగిల్స్‌`నీ బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ రెండు పాట‌ల్నీ రాసింది జొన్న విత్తులే.

సృష్టిలో వీడంత శృంగార ద్రోహి ఎవ‌డూ లేడు
ఎగ్సార్సిస్టుకి రిబ్బ‌న్ క‌ట్టి ఎక్స్‌పోజ్ చేస్తాడు
క‌సిలో ఖ‌రుడు
మ‌స‌లి జ‌డుడు
సెక్సోన్మాదుడు
దుష్‌బ్ర‌స్టుడు… అంటూ… ఏ రేంజులో ఆడుకున్నాడు. ఇలాంటి పాట‌లు ఇంకో రెండున్నాయట ఈ సినిమాలో. మొత్తానికి జొన్న విత్తుల వ‌ర్మ‌పై రివైంజ్ తీర్చుకోవ‌డానికి బాగానే ప్రిపేర్ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close