వైసీపీలోకి గంటా కాదు.. వాసుపల్లి గణేష్..!

విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ సిద్దాంతం ప్రకారం.. ఆయన కండువా కప్పుకోలేదు కానీ.. ఆయన కుమారుడికి కప్పించారు. దాంతో ఆయన కూడా అనధికారికంగా వైసీపీ సభ్యుడైపోయారు. ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన మద్దాల గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం.. వైసీపీలో అనధికారికంగా చేరి.. టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి వాసుపల్లి గణేష్ తోడు కానున్నారు. మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం కాగా.. ఇంకా పందొమ్మిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో గంటా లాంటి వాళ్లు ఇంకా ఉన్నారు. వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరడంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆయనే.. జగన్ వద్దకు వాసుపల్లి గణేష్‌ను తీసుకెళ్లారు.

విశాఖ టీడీపీ నేతల్ని వైసీపీలోకి చేర్చే ప్రక్రియలో విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గంటా శ్రీనిసరావును ఆయన ప్రమేయం లేకుండా పార్టీలో చేర్చకుంటున్నారన్న ప్రచారం జరిగినప్పుడు ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. తర్వాత పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. గంటా వైసీపీలోకి వస్తే.. మొత్తం పార్టీ డిస్టర్బ్ అవుతుందన్న అభిప్రాయాన్ని కల్పించి.. ఆయన రాకను అడ్డుకోగలిగారు. అదే సమయంలో.. పార్టీ బలోపేతం కోసం.. మరో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొచ్చేందుకు జగన్ ను ఒప్పించారు. వాసుపల్లి గణేష్‌కు కొన్ని వ్యాపారాలు.. విద్యాసంస్థలు ఉన్నాయి. ఆ వైపు నుంచి విజయసాయి ప్రయత్నించడంతో వాసుపల్లి మెత్తబడిపోయారు.

వాసుపల్లి రెండో సారి టీడీపీ తరపున గెలిచారు. ఆయన మొన్నటి వరకూ చురుగ్గానే ఉన్నారు. అయితే ఒత్తిళ్లు భరించలేక… వైసీపీ గూటికి చేరారు. మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలని టీడీపీకి దూరం చేస్తే.. తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రధాన ప్రతిపక్ష హోదాను.. దూరం చేయవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఆ మేరకు కొంత మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. అయితే.. సభలో మరో పార్టీ లేకపోవడంతో… ప్రతిపక్ష పార్టీ అయినా.. ప్రధాన ప్రతిపక్షం అయినా టీడీపీనే ఉంటుంది. పరిస్థితుల్ని బట్టి.. గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పడల్లా.. ఒక్కో టీడీపీ ఎమ్మెల్యేలను లాగానే ప్లాన్ వైసీపీ అమలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close