సంప్రదాయం గోవిందా..! బీజేపీకి ఇది పెద్ద ఇష్యూలా అనిపించడం లేదా..!?

తిరుమల పవిత్రను మంట గలిపేలా.. దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయాన్ని కాలరాస్తూ.. శ్రీవారిపై నమ్మకం లేని అన్యమతస్తులు కూడా..నేరుగా ఆలయంలోకి ప్రవేశించవచ్చని.. పట్టు వస్త్రాలు సమర్పించవచ్చన్నట్లుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయంపై హిందువుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ వైపు బయట దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతూంటే..తిరుమలో శ్రీవారి సంప్రదాయాలపై దాడి జరుగుతోందనే భావన వ్యక్తమవుతోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు. ఓ వ్యక్తి కోసం తిరుమల పవిత్రతను మంటగలిపి..హిందువుల మనోభావాలను దెబ్బతీస్తు్ననారని…ఇలాంటి చర్యల్ని కేంద్రం అడ్డుకోవాలి కోరారు. మాజీ టీటీడీ ఐవైఆర్ కృష్ణరావు కూడా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ట్విట్టర్‌లో ఖండించారు. ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న నిబంధనను మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రే సమర్పించాలన్న నిబంధన ఎక్కడాలేదని.. హిందూత్వంపై ముఖ్యమంత్రికి విశ్వాసం లేకపోతే దేవాదాయ మంత్రి పట్టువస్త్రాలు సమర్పించవచ్చునని ఐవైఆర్‌ సలహా ఇచ్చారు. డిక్లరేషన్ ప్రక్రియ లేదంటూ కొత్త వాదన తెచ్చి.. వైవీ సుబ్బారెడ్డి హిందూ మతంపై దాడి చేస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఏవీ రమణ మండిపడ్డారు. 16 నెలల్లో భక్తుల మనోభావాలు దెబ్బతీసి టీటీడీని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర హిందూత్వవాదులు ఈ అంశాన్ని చాలా సీరియస్‌ మ్యాటర్‌గా భావిస్తున్నారు. కానీ ఆలాయల పవిత్రతను కాపాడటానికి తామే బ్రాండ్ అంబాసిడర్లమన్నట్లుగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతల నోరు మాత్రం పెగల్లేదు.

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఇంత కాలం రాజకీయాలు చేస్తున్నారు కానీ… ఇంద్రకీలాద్రి రథం నుంచి చోరీచేసిన విగ్రహాల గురించి..అత్యంత పవిత్రమైన తిరుమలలో సంప్రదాయలను మార్చేస్తున్న వైనం గురించి వారు మాట్లాడటంలేదు. రాజకీయం కోసం అయితే ఎన్నైనా చేస్తారు కానీ.. తిరుమల పవిత్రత కోసం బీజేపీ నేతలు … ఎందుకు మాట్లాడరన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close