అక్టోబ‌రులో.. ఆ మూడూ..!

షూటింగుల‌కు కొత్త క‌ళ రాబోతోంది. మ‌ళ్లీ బ‌డా స్టార్లు సెట్లో అడుగుపెట్ట‌డానికి రెడీ అవుతున్నారు. చిరంజీవి `ఆచార్య‌` అక్టోబ‌రు రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్ల‌నున్న‌ద‌ని స‌మాచారం. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కీ అప్పుడే ముహూర్తం సెట్ అయ్యింది. `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ ఆదివారం నుంచి మొద‌లైంది. అయితే.. సెట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ లేడు. ప‌వ‌న్ అక్టోబ‌రు నుంచి డేట్లు ఇచ్చిన‌ట్టు చిత్ర యూనిట్ లోని కీల‌క‌మైన స‌భ్యుడు తెలుగు 360కి తెలిపారు. సో.. మూడు పెద్ద సినిమాలూ అక్టోబ‌రులోనే కొత్త షెడ్యూల్ మొద‌లు పెట్ట‌బోతున్నాయ‌న్న‌మాట‌.

ఈ మూడు చిత్రాల్లో `వ‌కీల్ సాబ్‌` సంక్రాంతికి రాబోతోంది. సంక్రాంతికి అంటే ఇంకా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి.. స్లో అండ్ స్ట‌డీగా షూటింగ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఆర్‌.ఆర్‌.ఆర్ ముందు ఓ టార్గెట్ ఉంది. ఎన్టీఆర్ కి సంబంధించిన టీజ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల చేయ‌లేదు. కాబ‌ట్టి… ముందు ఆ టీజ‌ర్ వ‌దిలి.. ఫ్యాన్స్‌ని ఖుషీ చేయాలి. చిరంజీవి పుట్టిన రోజున `ఆచార్య‌` మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చింది. విడుద‌ల‌కు సైతం స‌మ‌యం ఉంది. కాబ‌ట్టి.. ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ ఏమీ అవ‌స‌రం లేదు. అయితే .. ఈ సెట్లో చిరు ఎప్పుడు అడుగుపెడ‌తాడు? చ‌ర‌ణ్ ఎప్పుడు వ‌స్తాడు? అన్న‌దే కీల‌కం. ముందు చ‌ర‌ణ్‌తోనే షూటింగ్ మొద‌లెడ‌తార‌ని, ఆ త‌ర‌వాత చిరు బ‌రిలోకి దిగుతాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి ఈ మూడు సినిమాలూ అక్టోబ‌రులో మొద‌లు కాబోతున్నాయి. క‌రోనా బారీన ప‌డి అల్లాడిన చిత్ర‌సీమ‌కు, సినీ ప్రియుల‌కు ఇంత‌కంటే మంచి వార్త ఏముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close