మైహోంపై బీజేపీ ఎంపీ చేస్తున్న పోరాటం ఫలించదా..?

మైహోం సంస్థ యజమాని జూపల్లి రామేశ్వరరావుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎడతెగని పోరాటం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో మైహోం సంస్థ అక్రమంగా మైనింగ్ చేస్తోందని..కొన్ని ఆధారాలతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు.. సంబంధింత అంశంపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. నోటీసులు పంపించగలిగారు. కానీ మైహోం సంస్థ.. ఇటు తెలంగాణ… అటు ఏపీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులది. దీంతో ఆ నోటీసులు అలా ఉండిపోయాయి. దీనిపై అరవింద్ మండిపడుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ వద్దకు చేరాయి. అయితే ఆయన పక్కన పెట్టేశారు.

కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులైన అధికారుల్లో మొదటి ఆఫీసర్ జయేష్ రంజన్. ఆయన మైహోంకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనూ జయేష్‌ పట్టించుకోవటంలేదని ఎంపీ అరవింద్ మండిపడుతున్నారు. మైహోం సంస్థ నల్గొండ జిల్లాలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందని.. అలాగే గుంటూరులో వెయ్యి ఎకరాల అక్రమ మైనింగులున్నాయని అంటున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే… అటవీ భూముల్లో మైహోం సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందన్నారు. ఆంధ్రలో ఐఏఎస్ అధికారులకు రూల్స్ తెలియవా అని అరవింద్ ప్రశ్నిస్తున్నారు.

క్రిమినల్స్‌ను కాపాడవద్దని మైహోం సంస్థ నుంచి రూ.వేల కోట్ల పెనాల్టీలు వసూలు చేసి… భరతమాత రుణం తీర్చుకోవాలని జగన్‌కు ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపునిచ్చారు. మైహోం సంస్థ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మైహోం సంస్థ సిమెంట్ విభాగం కోసం మైనింగ్ నిర్వహిస్తోంది. ఈ మైనింగ్ అంతా అక్రమం అని అర్వింద్ వాదన. అరవింద్ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే అవకాశం లేదు. మరి కేంద్రమే మరింత చొరవతీసుకోవాల్సి ఉంది. అలాంటి పరిస్థితి ఉందో లేదో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close