రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్..!

రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సమరం అరెస్టులకు దారి తీసింది. ఆర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు. గతంలో రిపబ్లిక్ టీవీ కోసం పని చేసిన ఇంటీరియర్ డిజైనర్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్నాబ్ గోస్వామి డబ్బులు చెల్లించనందునే మనస్తాపానికి గురై వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా గతంలో కేసు నమోదయింది. ఆ కేసులో ఆర్నాబ్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసినట్లుగా ముంబై పోలీసులు ప్రకటించారు. ఆర్నాబ్‌పై భౌతికంగా దాడి చేశారని రిపబ్లిక్ టీవీ ఆరోపించింది. ఆయనను వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

కొంత కాలంగా ఆర్నాబ్ వర్సెస్ మహారాష్ట్ర గవర్మమెంట్ అన్నట్లుగా వార్ జరుగుతోంది. బీజేపీతో సంబంధాలు వదులుకుని కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి రిపబ్లిక్ టీవీ శివసేనను టార్గెట్ చేసింది. ఏక పక్షంగా వార్తలు ప్రసారం చేస్తోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును.. హత్య కేసు అన్నట్లుగా స్వయం ఇన్వెస్టిగేట్ చేసింది. ఉద్దవ్ ధాకరే కుమారుడిపై ఆనుమానాలు వ్యక్తం చేసింది. బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఆ తర్వాత.. టీఆర్పీ స్కామ్‌లో రిపబ్లిక్ టీవీపై కేసులు నమోదయ్యాయి.

ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్‌పై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఎడిటర్స్ గిల్డ్ తాము షాక్‌కు గురయ్యామని తెలిపింది. అయితే ఆర్నాబ్ గోస్వామిని జర్నలిజానికి సంబంధం లేని కేసులో అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ చేస్తున్న ప్రసారాలకు.. అరెస్ట్‌కు సంబంధం లేదంటున్నారు. అయితే రిపబ్లిక్ టీవీ మాత్రం.. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు ఎప్పుడో పరిష్కారమయిందని చెబుతోంది. మొత్తానికి ఆర్నాబ్ అరెస్ట్ అటు రాజకీయ రంగంలోనూ.. ఇటు మీడియాలోనూ చర్చనీయాంశం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెగా ఫ్యామిలీలో రచ్చ…అల్లు అర్జున్ పై నాగబాబు సీరియస్..!?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడంపై ఇంకా తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆయన పర్యటన...

వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు ఇది అవ‌స‌ర‌మా అధ్య‌క్షా..?!

ఏ ఆటైనా మైదానంలో జ‌ట్టు స‌భ్యులంతా స‌మ‌ష్టిగా ఆడితేనే అందం, విజ‌యం. ఒక‌రిపై మ‌రొక‌రు క‌స్సుబుస్సులాడుతుంటే, క‌య్యానికి కాలుదువ్వుతుంటే, అస‌లు జ‌ట్టు స‌భ్యుల మ‌ధ్య స‌యోధ్య లేక‌పోతే - ప్ర‌త్య‌ర్థుల‌పై ఎలా త‌ల‌ప‌డ‌తారు?...

విజ‌య్ స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి?

టాలీవుడ్ లో ఓ కొత్త కాంబోకి తెర లేవ‌నుందా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయి ప‌ల్ల‌వి క‌లిసి న‌టించ‌బోతున్నారా? ఆ అవ‌కాశాలు ఉన్నట్టే క‌నిపిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో...

విశ్వసనీయత కోల్పోతున్న కేసీఆర్…?

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close