యరపతినేని ఇంట్లో సీబీఐ సోదాలు..!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై సీబీఐ విచారణ ప్రారంభించంది. పల్నాడులో లైమ్ స్టోర్ అక్రమ తవ్వకాలు జరిగాయంటూ ఏపీ సర్కార్ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. గత ఆగస్టులో సిఫార్సు చేయగా.. ఇప్పుడు సీబీఐ బృందాలు పని ప్రారంభించాయి. గురువారం ఒక్క రోజే దాదాపుగా పాతిక చోట్ల.. సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఇంట్లో కూడా సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ తోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లోఈ సోదాలు జరిగాయి. అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తం ఉందని.. ఆంధ్రా బ్యాంకులో యరపతినేనికి సంబంధించిన అక్రమ లావాదేవీలు జరిగాయని సీఐడీ గతంలో ప్రకటించింది.

గురజాల నియోజకవర్గంలోని నడికుడి, కోనంకి, కేశానుపూడి గ్రామాల్లో అక్రమంగా సున్నపురాయి తవ్వకాలు జరుపుతున్నారంటూ… 2015లో కొంత మంది వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలా అక్రమ తవ్వకాలను.. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరులే చేపడుతున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని… ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీజీవీ కృష్ణారెడ్డి దీనిపై మరో పిల్ వేశారు. హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని .. ఎమ్మెల్యే యరపతినేనిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది. తాము సీబీఐతో విచారణ చేయిస్తామని ఏపీ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. దానికి హైకోర్టు అంగీకరించింది.

ఏపీలో గత ప్రభుత్వం సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. కొత్త ప్రభుత్వం రాగానే జనరల్ కన్సెంట్ ను పునరుద్ధరించింది. అయితే సరస్వతీ భూముల విషయంలో రైతులకు అండగా ఉన్నందుకే జగన్‌ తనపై కక్ష కట్టారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. సీబీఐ అధికారులను ఉరకుక్కలని దూషించిన నాయకులు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కు సిఫార్సు చేయడం ఏమిటని ఆయన గతంలో మండిపడ్డారు. ఇప్పుడు సీబీఐ విచారణ ప్రారంభించింది. అక్రమ మైనింగ్‌లో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close