కేసీఆర్‌ని వద్దన్నారా..? కేసీఆరే వెళ్లడం లేదా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తున్నారు. ఆయన ప్రధాని హోదాలో వస్తున్నారు…వస్తోంది కూడా రాజకీయ పర్యటనకు కాదు. కాబట్టి.. ఓ ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం.. ముఖ్యమంత్రి ఎదురెళ్లి స్వాగతం చెప్పాలి. మామూలుగా అయితే.. ఇది పెద్ద వివాదం కాదు. ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్లి స్వాగతం పలుకుతారు. అధికారిక కార్యక్రమాలకు వచ్చారని..మోడీని తీవ్రంగా వ్యతిరేకించే మమతా బెనర్జీ లాంటి నేతలు కూడా వెళ్లి స్వాగతం పలికి సందర్భాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ మాత్రం వెళ్లడం లేదు. మోడీ పర్యటన ఖరారయినప్పటి నుండి అదే పనిగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. మోడీకి స్వాగతం పలకడానికి కేసీఆర్ వెళ్తారా లేదా అన్నదానిపైనే చర్చ.

శుక్రవారం సాయంత్రం వరకూ అదే తరహా చర్చ జరిగింది. వెళ్తారా.. లేదా అన్నదానిపై… సీఎంవో కూడా స్పష్టత ఇవ్వలేదు. చివరికి పొద్దు పోయిన తర్వాత ప్రధానమంత్రి మోదీనే స్వాగతానికి వద్దన్నారనే సమాచారాన్ని మీడియాకు అందించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యదర్శి స్వయంగా సీఎస్‌కు ఫోన్ చేశారని.. ఎలా స్వాగతం చెప్పాలో.. ఎవరెవరికి అనుమతి ఉందో చెప్పారని అంటున్నారు. మొత్తంగా ఐదుగురు అధికారులకు మాత్రమే మోడీకి స్వాగతం చెప్పడానికి పర్మిషన్ లభించింది. గవర్నర్ కూడా వెళ్లడం లేదు. పీఎంవో చెప్పిన ఈ ఫార్మాలా బాగుండటంతో.. కాగల కార్యం పీఎంవోనే తీర్చిందని.. టీఆర్ఎస్ వర్గాలు సంతోషపడ్డాయి.

అయితే.. తెలంగాణ పర్యటనకు వచ్చినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆహ్వానికి రాకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న ఉద్దేశంతోనే పీఎంవో… ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. గతంలో కేసీఆర్‌తో మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మారిపోయిన రాజకీయం కారణంగా కేసీఆర్ .. కేంద్రంపై యుద్ధం చేస్తానని చెబుతున్నారు. బీజేపీని బద్మాష్ బీజేపీ అంటున్నారు. ఈ కారణంగా గ్యాప్ పెరిగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close