గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా… ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో పాల్గొననున్నారు. ఇందు కోసం టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేనిఫెస్టో విడుదల రోజు.. కీలక వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు. అయితే.. ఆ రోజుకు.. ఇప్పటికి పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి. ఈ తరుణంలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ప్రారంభమయింది.

అదే సమయంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. అయితే.. ఓ స్థానిక సంస్థ ప్రచానికి ప్రధాని స్థాయి నేత రావడం అరుదు. దానికి తగ్గట్లుగానే మోదీ పర్యటన గ్రేటర్ ప్రచారం కోసం కాదు. కానీ.. ఆయన పర్యటన ఖచ్చితంగా గ్రేటర్ ఓటర్లపై ప్రభావం చూపేలా ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధమయింది. మధ్యాహ్నం ప్రధాని మోదీ భారత్ బయోటెక్ ను సందర్శిస్తారు. వ్యాక్సిన్ పురోగతిని పరిశీలిస్తారు. మీడియాతో మాట్లాడుతారో లేదో స్పష్టత లేదు. కానీ ఆయన పర్యటన గంట మాత్రమే ఉండనుంది.

మరో వైపు బీజేపీ అగ్రనేతలు రోజుకొకరు చొప్పున పర్యటిస్తున్నారు. ప్రచారానికి ఆఖరి రోజు వరకూ.., ఎవరో ఒకరు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అమిత్ షా కూడా రానున్నారు. మరో వైపు కేసీఆర్ ప్రచారసభతో టీఆర్ఎస్.. ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లినట్లుగా అవుతుంది. ప్రచార బరిలో.. అగ్రనేతలతో ప్రచారంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో జాతీయ స్థాయి నేతలెవరూ పాల్గొనడం లేదు. కేసీఆర్ పొలిటికల్ సభ… మోడీ అపొలిటికల్ టూర్ గ్రేటర్ ప్రచారాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close