“పంచాయతీ ఎన్నికల”పై స్టేకు హైకోర్టు నిరాకరణ..!

పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయంపై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని.. ఎస్‌ఈసీ భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని.. ఎస్‌ఈసీని నిలువరించాలంటూ.. ఏపీ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు..స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ రేపు కూడా కొనసాగనుంది.

స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని గతంలో సుప్రీంకోర్టుకూడా స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో సామాన్యంగా కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. ఈ విషయం సాధారణ న్యాయ విషయాల్లో అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం మొండి పట్టుదలగా.. ఎస్‌ఈసీని నియంత్రించాలన్న ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని హైకోర్టులో చెప్పించాలని తాపత్రయ పడింది.ఇప్పుడు.. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఎస్‌ఈసీ విధి నిర్వహణకు అడ్డు చెప్పడం కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

గతంలో ఎస్‌ఈసీకి ఎన్నికల నిర్వహణలో సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం సహకరించడం లేదు. రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయించింది. ఓటర్ల జాబితా సిద్ధం చేసే విషయంలోనూ సహకరించడం లేదు. కోర్టుల్లో ప్రయత్నాలు చేసి.. ఆలస్యం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సానుకూల ఫలితం రాదని తెలిసి కూడా.. హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close