చినజీయర్‌ ఆలయాల యాత్ర వెనుక బీజేపీ ఉందా..!?

దుండగుల దాడుల్లో ధ్వంసమైన ఆలయాలు అన్నింటినీ చూస్తేందుకుయాత్ర చేస్తానని ప్రకటించిన చినజీయర్ స్వామి… ఆ యాత్రను ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయప్రముఖులతో సన్నిహితంగా ఉండే స్వాముల్లో చినజీయర్ ఒకరు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆస్థాన స్వామిజీ. అలాగే.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పని గట్టుకుని మరీ వచ్చి.. శంషాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రెండు, మూడు రోజుల పాటు పూజలు..ధ్యానాలు చేసి వెళ్తూంటారు. రాజకీయంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్వామి … రాజకీయంగా కలకలం రేపుతున్న అంశంపై ధాటిగా స్పందిస్తే… ఖచ్చితంగా విశే్షమే అవుతుంది.

దానికి తగ్గట్లుగానే ఆయన ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశంలో యాక్టివ్ అయ్యారు. అన్ని ఆలయాలను పరిశీలించబోతున్నారు. అయితే ఇందులో ఉన్న విశేషం ఏమిటటే.. దాడులకు గురైన ఆలయాలన్నింటినీ పరిశీలించారని బీజేపీ నేతలు కూడా నిర్ణయించారు. ఇందు కోసం రథయాత్ర చేయాలనుకున్నారు. ఆ రథయాత్ర రూట్ మ్యాప్ ఖరారు కోసం… ఆదివారమే విశాఖలో సమావేశం అవుతున్నారు. అదే రోజు నుంచి చినజీయర్ యాత్ర ప్రారంభించబోతున్నారు. చినజీయర్ యాత్ర.. కాస్త కదలిక తీసుకువస్తుందని.. దాన్ని రాజకీయ యాత్ర ద్వారా తాము.. బలంగా మార్చుకుంటామని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీకి మేలు చేయడానికే.. చినజీయర్ యాత్ర చేస్తున్నాడని చెప్పలేం కానీ.. ఆయన యాత్రను.. తమకు అనుకూలంగా మల్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్న విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదన్న చర్చ జరుగుతోంది. అయితే చినజీయర్‌కు ఉన్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నేపధ్యంలో ఆయన యాత్రను విడిగా చూడాల్సిన అవసరం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. చినజీయర్ యాత్రను ఏపీ సర్కార్ కూడా అడ్డుకునే అవకాశం లేదు. అలా అడ్డుకుంటే అది మరింత వివాదాస్పదం అవుతుంది. అదే సమయంలో..  బీజేపీ యాత్రనూ అడ్డుకున్నా.. రాజకీయ వివాదం అవుతుంది. అందుకే ఈ యాత్రల విషయంలో ఏం చేయాలన్నదానిపై వైసీపీ హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close