పవన్ కు సవాల్ విసిరిన వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు

వైఎస్ఆర్ సీపీ నేత అన్నా రాంబాబు పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. తను గిద్దలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని, పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తన పై పోటీచేయాలని, ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేసి తనపై గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని, ఒకవేళ తాను గెలిస్తే పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీని రద్దు చేసుకోవాలని, అన్నా రాంబాబు పవన్ కళ్యాణ్ పై సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళితే..

అన్నా రాంబాబు సవాల్ కి నేపథ్యం:

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వెంగయ్య అనే యువకుడు తమ ఎమ్మెల్యే అయిన అన్నా రాంబాబు ని నియోజకవర్గంలో అద్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితి గురించి ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే ని ప్రశ్నించినప్పుడు, ఆయన వెంగయ్య పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, దురుసుగా ప్రవర్తించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఆమధ్య వైరల్ గా మారింది. అయితే వీడియో అలా వైరల్ గా మారిన రెండు మూడు రోజులకే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో బెదిరించి ఒత్తిడి చేసి వెంగయ్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు అని జనసేన కార్యకర్తలు నాయకులు ఆరోపించారు. గత ఏడాది మద్యం రేట్లు విపరీతంగా పెంచడం పై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మరో యువకుడు కూడా ఇదేవిధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతల బెదిరింపులు కారణం అని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ , సూచనలు:

అయితే వెంగయ్య కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తన తరఫున పార్టీ తరఫున జనసేన కు చెందిన ఇతర నాయకుల తరపున నుండి మొత్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల దాకా వెంగయ్య కుటుంబానికి అందజేశారు. అయితే ఎంత సాయం చేసినా, పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేము అని, అందుకే జనసైనికులు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్లి నాయకులను ప్రశ్నించడం చేయవద్దని, కనీసం 40 50 మంది ఒక చోట చేరిన తర్వాతే నాయకులను ప్రశ్నించాలని, అలా గుంపు గా వెళ్ళి ప్రశ్నించినప్పుడు మాత్రమే వైకాపా నేతలు కాస్తయినా భయపడతారని, జనసైనికుల ప్రాణాలు కాపాడుకోవడం తనకు అత్యంత ముఖ్యమైన విషయం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాంబాబుకి జగన్ అప్పాయింట్ మెంట్ నిరాకరణ, టికెట్ గల్లంతు?

ఒక ఎమ్మెల్యే ని ప్రశ్నించిన యువకుడిని ఆత్మహత్య చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తూ వుంటే, ఆ వార్త ని పక్కన పెట్టిన అగ్ర మీడియా చానల్స్, రాజకీయ నాయకుల ఉత్తుత్తి సవాళ్ల ను రోజుల తరబడి చూపిస్తూ కాలక్షేపం చేసింది. మీడియా ఎంతగా దాచిపెట్టినా, సోషల్ మీడియా కారణంగా ఈ వార్త రాష్ట్రమంతా పాకింది. దీని పై వివరణ ఇవ్వడానికి అన్నా రాంబాబు జగన్ అపాయింట్మెంట్ కోరగా, జగన్ అపాయింట్మెంట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. గిద్దలూరు నియోజకవర్గం టికెట్ కోసం వైఎస్ఆర్సిపి నుండి ఇతర నాయకులు కూడా ప్రయత్నిస్తూ ఉండడంతో వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు కి వైఎస్ఆర్ సిపి తరపున టికెట్ గల్లంతు అయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇమేజ్ రికవరీ కోసం రాంబాబు సవాల్:

జగన్ అపాయింట్మెంట్ నిరాకరించడం, దాంతోపాటు టికెట్ గల్లంతైనట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతుండడం కారణంగా తన ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ కావడంతో అన్నా రాంబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పైగా నియోజకవర్గంలో తన ప్రతిష్ట పూర్తిగా మసకబారటంతో, పవన్ కళ్యాణ్ తన పై ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతూ నియోజకవర్గం లో మళ్లీ తన ఇమేజ్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో చింతమనేని ప్రభాకర్, వనజాక్షి అనే ఉద్యోగిని కొట్టినప్పుడు, చంద్రబాబు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని గట్టిగా వాదించిన జగన్ ఇప్పుడు అన్నా రాంబాబు పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close