జగన్ తరపున వకాల్తా, నిమ్మగడ్డకు ముద్రగడ లేఖ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పంచాయతీఎన్నికల నిర్వహణ అత్యంత హాట్ టాపిక్ గా మారింది. తాను పదవి నుండి దిగిపోయే లోపు ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నిస్తూ ఉంటే, గతంలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కి కులాన్ని ఆపాదిస్తూ విమర్శలు చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలు ఇప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించరాదు అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ రమేష్ కు లేఖ రాశారు. వివరాల్లోకి వెళితే..

ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ కు రాసిన లేఖలో, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రత్యేకించి ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మొండిగా వెళ్లి ఎన్నికలు నిర్వహించరాదని ముద్రగడ, నిమ్మగడ్డ రమేష్ కు సూచించారు. అయితే ముద్రగడ రాసిన బహిరంగ లేఖపై విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం కాపు ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిన ముద్రగడ, కాపు రిజర్వేషన్ల అంశంపై వైయస్ జగన్ ని ప్రశ్నించడానికి మనసు రాక ఇటువంటి తనకు సంబంధం లేని అంశాలపై ఫోకస్ చేస్తున్నారని, అక్కడ కూడా కేవలం జగన్ మనోభీష్టాని కి అనుగుణమైన వాదననే ముద్రగడ వినిపిస్తున్నారని ఆ లేఖ చదివినవారి నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.

అటు కమ్యూనిస్టులతో పాటు అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో, ముద్రగడ పద్మనాభం జగన్ కు అనుగుణమైన వాదనతో వార్తల్లోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close