ఎక్స్‌క్లూజీవ్‌: ‘పెళ్లి సంద‌D’ హీరో… రాఘ‌వేంద్ర‌రావు

శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడిగా రాఘ‌వేంద్ర‌రావు కీర్తి గ‌డించారు. ఇప్పుడాయ‌న‌కు న‌ట‌న‌పై ఆసక్తి క‌లిగింది. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో రాఘ‌వేంద్ర‌రావు హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. దాంతో ద‌ర్శ‌కేంద్రుడు న‌టుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అంత‌కంటే ముందుగా రాఘ‌వేంద్ర‌రావు తెరంగేట్రం చేసేస్తున్నారు. `పెళ్లి సంద‌డి` సినిమాతో.

రాఘ‌వేంద్ర‌రావు తీసిన సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో.. పెళ్లి సంద‌డి ఒక‌టి. ఈ సినిమాతో శ్రీ‌కాంత్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ తో న‌యా `పెళ్లి సంద‌డి`కి శ్రీ‌కారం చుట్టారు. ఈ చిత్రానికి రాఘ‌వేంద్ర‌రావు శిష్యురాలు గౌరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. రాఘేవేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప‌రిమిత‌మ‌య్యారు. అయితే.. ఇప్పుడు తేలిన విష‌యం ఏమిటంటే… ఈ సినిమాలో హీరో రోష‌న్ కాదు. రాఘ‌వేంద్ర‌రావే. ఆయ‌న కోణంలోనే క‌థ న‌డుస్తుంద‌ని తెలుస్తోంది. రాఘ‌వేంద్ర‌రావు య‌వ్వ‌నంలో ఉండే పాత్ర‌ని రోష‌న్ పోషిస్తున్నాడ‌ట‌. అంటే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ నేరేష‌న్ లో సాగ‌బోతోంద‌న్న‌మాట‌. `తీన్ మార్‌`లో ప‌రేష్ రావ‌ల్ ఫ్లాష్ బ్యాక్‌లోకి… ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చిన‌ట్టు, ఇక్క‌డ‌.. రాఘ‌వేంద్ర‌రావు ఫ్లాష్ బ్యాక్‌లో రోష‌న్ వ‌స్తాడ‌న్న‌మాట‌. సో.. ద‌ర్శ‌కేంద్రుడి న‌ట‌నా అగ‌రంగేట్రం.. `పెళ్లి సంద‌డి`తో షురూ కాబోతోందనుకోవొచ్చు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. రోష‌న్ త‌దిత‌రుల‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close