మార్చి ఏడున తిరుపతి, సాగర్ ఉపఎన్నికల షెడ్యూల్ ..!?

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల మూడ్ పీక్స్‌కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి… ఏపీలో తిరుపతి లోక్‌సభకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ మార్చి ఏడో తేదీన విడుదల కానున్న ఢిల్లీలోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ అయిన ఆరు నెలలలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రకారం చూసినా.. మార్చి మొదటి వారంలో ప్రక్రియ ప్రారంభిస్తే సమయానికి పూర్తవుతుంది. మార్చి ఏడో తేదీనే ఎందుకంటే… ఆ రోజున… ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అసోం , కేరళల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు పర్యటనలు చేయడం ఆయన స్టైల్. ఇప్పుడు అది జరుగుతోంది. ఆయన ఎక్కడెక్కడ సభలునిర్వహించాలో ..నిర్వహించేసిన తర్వాత ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఐదేళ్ల క్రితం మార్చి నాలుగో తేదీన విడుదల చేశారు.

ఈ సారి ఏడో తేదీన విడుదల చేయవచ్చని ప్రధాని మోడీనే స్వయంగా ప్రకటించారు. ఆయన మాటను జవదాటే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఒక రోజు అటు ఇటుగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. వాటితో పాటు తెలుగు రాష్ట్రాల ఉపఎన్నికల షెడ్యూల్ కూడా ఖాయంగానే విడుదల చేస్తారు. మరోసారి దేశంతోపాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close