నాగ‌చైత‌న్య తో బుచ్చిబాబు?

`ఉప్పెన‌`తో తొలి ప్ర‌య‌త్నంలోనే ఓ సూప‌ర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సానా. ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాత‌లు, హీరోల దృష్టి బుచ్చిపై ప‌డింది. అయితే… బుచ్చి ఆల్రెడీ మైత్రీకే క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. `ఉప్పెన‌` త‌దుప‌రి సినిమా కూడా మైత్రీ కే చేయాలి. త‌న రెండో సినిమాగా బుచ్చి ఓ స్పోర్ట్స్ డ్రామా రాసుకున్నాడు. అది ఎన్టీఆర్ కి యాప్ట్ అవుతుంద‌న్న‌ది త‌న న‌మ్మ‌కం. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు అందుబాటులో లేడు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌… త్రివిక్రమ్ సినిమా ఉంది. ఆ త‌ర‌వాత‌… `కేజీఎఫ్‌` ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తోనూ ఓ సినిమా చేస్తాడు. ఎన్టీఆర్ ఖాళీ అవ్వాలంటే క‌నీసం రెండేళ్ల‌కు పైగానే ఎదురు చూడాలి.

అందుకే.. ఆ స్పోర్ట్స్ డ్రామాని ప‌క్క‌న పెట్టాడ‌ట బుచ్చి. ఇప్పుడు త‌న ద‌గ్గ‌ర మ‌రో క‌థ సిద్ధం అవుతోంది. హీరోని తీసుకొచ్చే బాధ్య‌త మైత్రీ మూవీస్ దే. వాళ్లు నాగ‌చైత‌న్య – బుచ్చిబాబు కాంబినేష‌న్ సెట్ చేద్దామ‌ని భావిస్తున్నారు. బుచ్చి రాసిన క‌థ‌, చైతూకి న‌చ్చితే – ఈ కాంబో సెట్ అయిపోయిన‌ట్టే. కాక‌పోతే… చైతూకి కూడా కొన్ని క‌మిట్‌మెంట్స్ ఉన్నాయి. వాటి మధ్య‌న బుచ్చికి చోటు దొరుకుతుందా? లేదా? అనేది చూడాలి. ప్ర‌స్తుతానికైతే ఈ ప్రాజెక్టు పైప్ లైన్ లో ఉన్న‌ట్టే. బుచ్చి క‌థ చైతూకి విప‌రీతంగా టైమ్ట్ చేస్తే… త‌న చేతిలో ఉన్న ప్రాజెక్టులు ముందుకు జ‌రిపి, ఆ స్థానంలో బుచ్చి సినిమా ప‌ట్టాలెక్కేంచే ఛాన్స్ అయితే లేక‌పోలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close