తమిళనాడులో ఈ సారి ఉచితాలకు మించి..!

తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికలకు ముందుగా ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించారు.అమలు చేస్తారోలేదో తెలియదు కానీ.. అధికారికంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. రుణాల మాఫీతో పాటు విద్యార్థులందరూ పరీక్షలు రాయకుండానే పాసయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామి నిర్ణయాలు చూసి…తమిళ ప్రజలు కూడా నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా భయం ఇప్పుడు ఎక్కడా లేదు. స్కూళ్లు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కొద్ది రోజుల కిందట.. 9,10,11 తరగతుల విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసింది. ఒకటి నుంచి ఎనిమిది వరకు సాధారణంగానే పబ్లిక్ పరీక్షలు ఉండవు. దీంతో తమిళనాడులో అందరూ పరీక్షలులేకుండా పాస్ అయినట్లనిపించింది.

ఇదంతా ఎన్నికల జిమ్మిక్కే. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి పళనిస్వామి ఇలా చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో రైతు రుణమాఫీని ప్రకటించారు. కొన్ని షరతులు పెట్టినప్పటికీ దాదాపుగా రూ. పదిహేను వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు. అదే సమయంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 ఏళ్లకు పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టిందని తెలియగానే.. మరికొన్ని ఆఫర్లు ప్రకటించారు. అందులో బంగారం రుణాల రద్దు కూడా ఉంది.

అయితే ఇవన్నీ అమల్లోకి రావాలంటే మళ్లీ పళనిస్వామి సీఎం కావాలి. అప్పుడు మాత్రమే అమల్లోకి వస్తాయి. లేకపోతే.. రావు. ఎలా లేదన్నా.. మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ మేనిఫెస్టోనూ మరిన్ని ఉచిత పథకాలు రెడీ అవుతాయి. మొత్తానికి అరవం మార్క్ అతి.. తమిళనాడు ఎన్నికల్లో కనిపిస్తోంది. ఇంత చేసినా పళనిస్వామికి ఏమైనా చాన్స్ ఉందా అంటే పెదవి విరుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close