అమిత్ షా టూర్ కాన్సిల్..! తిరుపతిపై బీజేపీ అనాసక్తి..?

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించి.. అమిత్ షా జల వివాదాలను పరిష్కరిస్తారని.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సమావేశం అయితే ఖరారైంది. నాలుగు, ఐదు తేదీల్లో అమిత్ షా తిరుపతిలోనే ఉండాల్సి ఉంది. అయితే హఠాత్తుగా సమావేశానికి నాలుగు రోజుల ముందు అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయిందని సమాచారం అందింది. కారణాలేమిటో స్పష్టత లేదు. అమిత్ షా రాకపోతే.. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరిగే చాన్స్ లేదు.

ముఖ్యమంత్రుల స్థాయి వారితో సమావేశం పెట్టాలంటే అది ప్రధాని మోడీ లేదా.. అమిత్ షానే అయి ఉండాలి. లేకపోతే హాజరయ్యేందుకు ముఖ్యమంత్రులు కూడా ఆసక్తి చూపించరు. అంటే సమావేశం జరగనట్లేదని భావించాల్సి ఉంటుంది. తిరుపతి ఉపఎన్నిక, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో అమిత్ షా పర్యటనపై… బీజేపీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. షా వస్తారు.. సీన్ మార్చేస్తారని అనుకున్నారు. కానీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వాటి ఎన్నికల ప్రచారంపై అమిత్ షా ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లుగా చెబుతున్నారు.

బెంగాల్, అసోంలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లోనూ ఎన్నికల ప్రచారసభల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. తిరుపతిలో షా టూర్ రద్దు కావడంతో … అక్కడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో కూడా బీజేపీ సైలెంట్ అయినట్లేననన్న చర్చ జరుగుతోంది. తిరుపతిలో ఖచ్చితంగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే.. ఒక్క రోజు అయినా అమిత్ షా టూర్ పెట్టుకుని ఉండేవారని.. అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close