జగన్ తరహాలో పథకాల అమలుకు కేసీఆర్ కసరత్తు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి.. ప్రజల్లో మళ్లీ నాటి విశ్వాసాన్ని పొందాలని అనుకుంటున్నారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో సంక్షేమ బడ్జెట్ ప్రవేశ పెట్టి.,. ఓ క్యాలెండర్ ప్రకారం.. ఖచ్చితంగా అనుకున్న తేదీకి లబ్దిదారులకు నగదు అందించే ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు. బడ్జెట్ కసరత్తులో సీఎంకేసీఆర్ తన అభిప్రాయాన్ని అధికారులకు చాలా స్పష్టంగా చెప్పారు. బడ్జెట్‌పై అధికారులు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు. ప్రగతి భవన్‌లో ఈ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 1.82 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

కరోనా, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. అయితే కేసీఆర్ మాత్రం… ఈ సారి బడ్జెట్ పెరగాలని సూచించారు. పూర్తి స్థాయి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమలు చేయాల్సిన పథకాలతో పాటు.. కొత్త పథకాలకు నిధుల కేటాయింపుపైనా చర్చించారు. రుణమాఫీ,రైతు బంధు,నిరుద్యోగ భృతి వంటి వాటికి ఈ సారి నిధుల కేటాయింపు ఉండనుంది. సీఎం పరిశీలన తర్వాత బడ్జెట్ పదుల ప్రతిపాదనలపై తుది కసరత్తు జరగనుంది. అనంతరం శాఖల వారీగా పూర్తి స్థాయిలో నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది.

ఈనెల 15 తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే ఆలోచన లో ఉంది ప్రభుత్వం. ఈ సమావేశాలను దాదాపు 20 నుంచి 30 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం తలపోస్తోంది. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ సర్కార్‌పై ప్రజల్లో మోజు తగ్గిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం… ఇచ్చే పథకాలు సమయానికి అనుగుణంగా అందకపోవడంతో లబ్దిదారుల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరీని ఎప్పుడో నిలిపివేశారు. వీటన్నింటికీ… బడ్జెట్ ద్వారా పరిష్కారం చూపి.. ఈ సారి సంక్షేమ బడ్జెట్‌ను రూపొందించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారం రోజుల్లో.. బడ్జెట్‌కు ఓ రూపం ఇచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close