తిరుపతి నుంచి పోటీ చేసేది బీజేపీనే..!

తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ -జనసేన కూటమి తరపున భారతీయ జనతా పార్టీ అభ్యర్థే రంగంలో ఉంటారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కూడా అయిన మురళీధరన్ ప్రస్తుతం కేరళ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సమయంలో తీరిక చేసుకుని.. తిరుపతి అభ్యర్థి గురించి ప్రకటన చేశారంటే.. జనసేన కూడా అంగీకరించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు జనసేన, ఏపీ బీజేపీ అగ్రనేతలందరూ కలిసి జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా మురళీధరన్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ కోసం పోటీ నుంచి వైదొలిగిన జనసేన.. తిరుపతిలోనూ అదే దారి పట్టడంతో జనసైనికులు నిరాశకు గురవుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ కన్నా.. జనసేన ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలను పొందింది. అయినప్పటికీ.. జనసేన సీటును బీజేపీకి త్యాగం చేసింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఉపఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుందని అనుకున్నారు కానీ.. బీజేపీ కసరత్తులు పూర్తి కాలేదని అనుకున్నారో ఏమో కానీ.. విడిగా ప్రకటిస్తామని.. ఈసీ ప్రకటించింది. మొత్తంగా ఎనిమిది విడతల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో ఏదో ఓ దశలో… తిరుపతి , నాగార్జునసాగర్ ఉపఎన్నికల పోలింగ్ కూడా జరుగుతుంది. ఆ ప్రకారం షెడ్యూల్ విడుదలవుతుంది. తిరుపతిలో వైసీపీ ఎంపీ కరోనా కారణంగా చనిపోవడంతో ఉపఎన్నికలు వచ్చాయి. తాము పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్సాహపడ్డారు. చివరికి… వెనక్కి తగ్గినట్లుగా ఉన్నారు. ఇటీవల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

స్టీల్ ప్లాంట్ ఉద్యమంతో పాటు అనేక అంశాలు.. బీజేపీ-జనసేన కూటమికి ఇబ్బందికరంగా మారాయి. అక్కడ జనసేన పోటీ చేస్తేనే… ఓ వర్గం మద్దతు ఇస్తామని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. చివరికి బీజేపీనే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీకి ఏడు నియోజకవర్గాల్లో కలిపి ఇరవై వేల ఓట్లు కూడా రాలేదు. ఈ సారి మాత్రం.. గెలిచి చూపిస్తామని.. బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close