టాలీవుడ్‌ను చుట్టుముట్టబోతున్న కర్ణాటక డ్రగ్స్ కేసు..!?

కర్ణాటక పోలీసులు తెలుగు సినీ నటుడు తనీష్‌కు.. నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హాజరు కాకపోతే.. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి అరెస్ట్ చేసి పట్టుకెళ్లే అవకాశం ఉంది. ఒక్క తనీష్‌కు్ మాత్రమే కాదు.. మరో నలుగురు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ డ్రగ్స్ కేసు… ఇక్కడిది కాదు. కర్ణాటకది. కర్ణాటకలో బయటపడిన డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతూండగా.. లింకులు.. టాలీవుడ్‌కు దారితీశాయి. ఈ క్రమంలో తనీష్ పేరు బయటకు రావడంతో ముందుగా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరు డ్రగ్స్ కేసులో…  హీరోయిన్లు సంజన , రాగణిలను అరెస్ట్ చేసి చాలా కాలం జైల్లో ఉంచారు.

ఆ కేసు విచారణ తీగలాగుతూంటే.. అనేక లింకులు బయట పడుతున్నట్లుగా కనిపిస్తోంది. సినీ జగత్తులో మత్తు వ్యాపారం అంతా..  వ్యవస్థీకృతంగా ఉంటుందని… సినీ పరిశ్రమలు వేరైనా.. ఈ డ్రగ్స్ బిజినెస్ మాత్రం…  ఒకే రీతిన ఉంటుందని.. ఒకరికి ఒకరికి లింకులు ఉంటాయన్న ప్రచారం ఉంది. అది ఇప్పుడు.. కర్ణాటక పోలీసులు వెలికి తీసే అవకాశం కనిపిస్తోంది. గతంలో హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్‌లోనూ తనీష్ పేరు ప్రచారం జరిగింది. ఆయనకూ నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. ఇప్పుడు కర్ణాటక పోలీసుల రాడార్‌లోకి కూడా తనీష్ వెళ్లాడు. తనీష్‌ను విచారించిన తర్వాత మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖులకు… కర్ణాటక పోలీసులు నోటీసులుజారీ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తానికి హైదరాబాద్ పోలీసులు.. డ్రగ్స్ కేసు విషయంలో అంతని.. ఇంతని హడావుడి చేసి.. చివరికి కేసును పక్కన పడేశారు. ఇక్కడ పోలీసులకు పొలిటికల్  ఒత్తిడి ఎదుర్కొనిఉంటారు. కానీ కర్ణాటక పోలీసులకు అలాంటి ఒత్తిళ్లేమీ ఉండవు. ఉంటే గింటే.. కర్ణాటక స్టార్ల జోలికి వెళ్లకుండా చూస్తారేమో.. కానీ ఆధారాలుంటే.. టాలీవుడ్ స్టార్ల సంగతి చూడకుండా ఉండరని అంటున్నారు. మొత్తానికి డ్రగ్స్ కేసు.. కర్ణాటక వైపు నుంచి టాలీవుడ్‌ను చుట్టు ముట్టే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close