కోర్టులకు వరుస సెలవులొస్తే చాలు వాళ్లు వణికిపోవాల్సిందే..!

ఆంధ్రప్రదేశ్‌లో కోర్టులకు వరుసగా మూడు, నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయంటే… టీడీపీ నేతలు వణికిపోతున్నారు. వైసీపీ నేతలు ఎక్కడ ఏ తప్పుడు కేసు పెట్టి.. ఏదో ఓ ఫిర్యాదు చేసి.. తమకు ఎక్కడ అరెస్ట్ చేయిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అరెస్టులు మాత్రమే కాదు.. ఆస్తుల విధ్వంసం కూడా జరుగుతోంది. కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా… చూసుకుని… వచ్చిన పని పూర్తి చేసేలా.. కూల్చివేతలు చేసేసి.. తర్వాత కోర్టు నుంచి ఊరట పొందినా ఆ నష్టం అలాగే ఉండేలా… వైసీపీ నేతలు అధికారులతో కలిసి వ్యూహాత్మకంగా విధ్వంసానికి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు… చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.

తాజాగా.. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల కిందట… నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజు రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయారు. సాక్షులు ఎవరో చెప్పారంటూ… ఆయన మరణానికి కారణం అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు.  కొద్ది రోజుల కిందట.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే గా సత్తి సూర్యనారాయణరెడ్డికి మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే  భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ..   రామకృష్ణారెడ్డి బిక్కవోలు ఆలయంలో ప్రమాణానికి సవాల్ చేశారు. రెండు వర్గాలు ఆలయంలో ప్రమాణం చేశాయి. ఆ తర్వాత కూడా.. రెండు వర్గాల మధ్య  నియోజకవర్గంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

ఈ క్రమంలో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ మృతి  అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తున్నారు.  అక్రమ కేసులతో ఇంకెంత మందిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు,  కొల్లు రవీంద్ర,చింతమేని ప్రభాకర్ ఇలా చెప్పుకుంటూ పోతే.. పోలీసుల బారిన పడుతున్న టీడీపీ నేతల చిట్టా చాలా ఎక్కువే ఉంది. మూడు నాలుగు రోజులైనా.. జైలులో పెట్టాలన్న ఉద్దేశంతో రాజకీయ వ్యూహాలను పోలీసులు అమలు చేస్తూండటంతో ఎలా ఎదుర్కొవాలో తెలియక టీడీపీ నేతలు కిందా మీదా పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం 'డార్లింగ్‌'. ఈ...

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close