శ్రీవారికి రూ.300 కోట్లిస్తామంటే ముందూ వెనుక చూసుకోరా..!?

తిరుమల శ్రీవారికి రూ. మూడు వందల కోట్లు విరాళం ప్రకటిస్తూ.. ఓ భక్తుడు మందుకు వచ్చాడు.  ఆ భక్తుడి పేరు సంజయ్ కే సింగ్. ఆయన ఉండేది ముంబైలో. అద్వైత్ ఇన్‌ఫ్రాస్చ్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ అనేకంపెనీ యజమాని., ఈ కంపెనీని 2017లో ప్రారంభించారు. పుట్ట పగిలిపోయేంత లాభాలు సంపాదించినట్లుగా రికార్డుల్లో లేదు. అసలు రూ.మూడు వందల కోట్ల వ్యాపారం చేసినట్లుగా కూడా.. క్లారిటీ లేదు. కానీ.. ఆయన వచ్చి రూ. మూడు వందల కోట్లతో ఆస్పత్రి కట్టిస్తానంటే… టీటీడీ అధికారులు ఎంవోయూ చేసేసుకున్నారు. మీడియాకు గొప్పగా చెప్పుకున్నారు. 300 పడకల ఆసుపత్రిని నిర్మించి టీటీడీకి అప్పగిస్తారని… యంవోయూ చేసుకున్నారు.  

సంజయ్ సింగ్ ఆస్పత్రి కట్టిస్తానని ముందుకు వచ్చారు. ముందూ వెనుకా చూసుకోకుండా టీటీడీ ఒప్పందం చేసుకోవడం భక్తులను ఆశ్చర్య పరుస్తోంది.ఆ  సంజయ్ సింగ్‌కు మూడు వందల కోట్లు ఎలా వస్తాయో కనీస పరిశీలన చేయలేదు. కట్టగలరో లేదో కూడా పరిశీలించలేదు. అదే కేరళలో మాత్రం భారీ విరాళం ఇస్తామన్న ఓ వ్యక్తిని ఆదాయ ఆధారాలు కూడా తీసుకు రమ్మన్నారు.  కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లోని చొట్టనిక్కర్‌ భగవతి ఆలయానికి గత నవంబరులో కర్ణాటకకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 526 కోట్ల విరాళం ప్రకటించారు.  పెద్ద మొత్తంలో ఇస్తున్నారు కదా అని ఆలయ పాలక మండలి… రాచమర్యాదలు చేయలేదు.  ఈ నిధుల్ని వినియోగించేముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది.

ఆ నిధులన్నీ ఎలా సంపాదించారో చెప్పాలని కోరింది. అయితే.. ఆ సమర్పణకు దాత గడువు కోరాడు. ఆయన వివరాలిచ్చిన తర్వాతనే ఆ విరాళం వినియోగం గురించి పాలక మండలి ఆలోచిస్తుంది.కేరళకు చెందిన దేవాదాయ మంత్రిత్వ శాఖ కూడా పూర్తి వివరాల్ని తెలుసుకున్న తరువాతనే ముందుకెళ్లాలని నిర్ణయించింది.  సంజయ్ సింగ్ నుంచి కేరళ ఆలయ వర్గాలు తీసుకున్నట్లుగా వివరాలు సేకరించాలన్న సూచనలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close