ఓటు అడిగేశారు బ్రదర్..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగసభకు వెళ్లక ముందే తిరుపతి ప్రజల్ని ఓటు అడిగారు. తిరుపతి ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రత్యేకంగా లేఖ రాశారు. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో పథకాలు పొందిన లబ్దిదారులందరికీ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో లేఖ రాశారు. ఇరవై రెండు నెలలుగా ఎన్నెన్ని పథకాలు అందించామో.. ఎంతెంత ఖర్చు చేశామో.. ఎవరెవరికి ఎంతెంత లబ్ది చేకూర్చామో.. వివరిస్తూ..లేఖలు రాశారు. పథకాల లబ్దిదారులందరి జాబితాను దగ్గర పెట్టుకుని రెడీ చేసిన లేఖలను.. స్వయంగా పార్టీ శ్రేణులు.. ఆయా పథకాల లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఇచ్చి తప్పనిసరిగా ఓటు వేయాలని అభ్యర్థించనున్నాయి. జగన్మోహన్ రెడ్డి అటు అడిగినట్లుగా లేఖ ఉంది.

ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు జగన్మోహన్ రెడ్డి.. ప్రజలను ఓటు అడగరగని.. అడగకుండానే ప్రజలు ఓట్లేస్తారని మంత్రులు కొద్దిరోజులుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అసలు ఓటు అడగలేదని గుర్తు చేశారు. తిరుపతి ఎన్నికల్లోనూ జగన్ ఓటు అడగరని వారు చెప్పుకొచ్చారు. అనూహ్యంగా పధ్నాలుగో తేదీన జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. అంత కంటే ముందుగానే ప్రభుత్వ పథకాల లబ్దిదారులందరికీ.. లేఖలు రాయడం ప్రారంభించారు. వాటిని స్వయంగా పార్టీ శ్రేణులే వెళ్లి ఇస్తాయి కాబట్టి ఆ ప్రభావం వేరేగా ఉంటుందని వైసీపీ నేతలు అంచనాకు వస్తున్నారు.

అయితే.. ప్రభుత్వ పథకాలేమైనా జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి తీసి ఇచ్చారా… ప్రభుత్వం పన్నుల రూపంలో కట్టిన సొమ్ములేనని.. ప్రజల్ని అప్పుల పాలు చేసి.. పప్పు బెల్లాలు పంచుతున్నారని మండిపడుతున్నారు. అంతే కాక గత ప్రభుత్వం ప్రజలకు అందిన పథకాలను కూడా ఆపేశారని అంటున్నారు. వాటన్నింటినీ తాము ప్రజలకు వివరిస్తామని విపక్ష నేతలు అంటున్నారు. మొత్తానికి … ఓటు అడగను బ్రదర్ అన్న పొజిషన్ నుంచి ఓటు అడిగేశారు బ్రదర్ అనే పరిస్థితికి వచ్చిందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close