ఉత్తుత్తి సవాళ్ల రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల నేతల సవాళ్లు అసువుగా చేసేసుకుంటున్నారు. కానీ ఒకరి సవాల్‌కు ఒకరు అంగీకరించారు. ఎవరి సవాల్ వారిదే. మా సవాల్ స్వీకరించాలంటే మా సవాల్ స్వీకరించాలని రెండు వైపుల నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి జర్నలిస్టుల బ్రెయిన్ వాష్ చేస్తూంటారు. అంతిమంగా రెండు పార్టీల నేతల సవాళ్లదీ ఒకటే టార్గెట్.. అదే రాజీనామాలు చేయడం. అదే అసలు విషయం అయినప్పుడు అంశం ఏదయితేనేం… వెంటనే… ఏదో ఓ టాపిక్ మీద.. సవాల్‌ను ఆమోదింప చేసుకుని ఆ తర్వాత రంగంలోకి దిగితే.. రాజకీయంలో తాడేపేడో తేల్చుకున్నట్లు అవుతుంది కదా..! కానీ అలా తేల్చేసుకునే ఉద్దేశం రెండు పార్టీలకు లేదు. అందుకే సవాళ్ల పేరుతో రాజకీయ పండుగ చేసుకుంటున్నారు.

తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలిస్తే.. వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని.. టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. తిరుపతి ఉపఎన్నిక వేదికగా ప్రభుత్వ పాలనపై అభిప్రాయం చెప్పాలని చంద్రబాబు తనప్రచార ప్రసంగాల్లో కోరుతూండటంతో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. రాజధాని మార్పు ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలని గతంలో చంద్రబాబు ఇచ్చిన సవాల్‌ను ఆమోదించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అప్పట్లో చంద్రబాబు రాజధాని మార్పు అంశంపై అధికార పార్టీకి అదేపనిగా సవాళ్లు చేశారు. మూడు రాజధానులపై .. రిఫరెండంగా ఎన్నికలకు వెళ్దామని… ఒక వేళ వైసీపీ గెలిస్తే.. టీడీపీని మూసేసుకుంటామని ఆఫర్ ఇచ్చారు. కానీ వైసీపీ వైపు నుంచి స్పందన లేదు.

ఆ తర్వాత టీడీపీ ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీల రాజీనామాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఏప్రిల్ ఆరో తేదీన రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసింది. దానికికారణం ఉంది. గతంలో జగన్ ఏప్రిల్ ఆరో తేదీనే తమ ఎంపీలు రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ వీడియోను వైరల్ చేస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని సవాల్ చేశారు. తమ ఎంపీలుకూడా రాజీనామాలు చేస్తానన్నారు. కానీ వైసీపీ నుంచి ప్రతిస్పందన లేదు. కానీ…తిరుపతి ఉపఎన్నిక విషయం వచ్చే సరికి… మంత్రిపెద్దిరెడ్డికి సవాల్ చేయాలని అనిపించింది. వెంటనే… మీడియా ముందుకు వచ్చి సవాల్ చేశారు.

రాజధానుల అంశంపై, ప్రత్యేకహోదా అంశంపై సవాళ్లకు స్పందించని వైసీపీ… ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలకు సంబంధించి మాత్రం ఆసక్తిగా సవాల్ చేసింది. ఇదే అదనుగా ఇతర పార్టీల నేతలు.. రాజకీయం కోసం కాదు.. రాష్ట్రం కోసం రాజీనామాలు చేద్దామంటూ కౌంటర్లు ప్రారంభించారు. మొత్తానికి ఏపీలో ఎవరికీ… రాష్ట్రం కోసం.. రాజకీయం చేసే ఉద్దేశం లేదు. ప్రజల్ని మభ్యపెట్టే సవాళ్లతో రాజకీయం చేస్తున్నారు. ఎవరూ నేరుగా రంగంలోకి దిగడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close