వల్లభనేని వంశీ వైసీపీలోకి జంప్ చేయబోతున్నారా?

హైదరాబాద్: నిన్న, ఇవాళ విజయవాడలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ అనుమానం రాకమానదు. తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలో ఇన్నర్ రింగ్‌రోడ్‌కోసం అధికారులు చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కటం, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయటం, దానికి నిరసనగా వంశీ తన గన్‌మ్యాన్‌లను సరెండర్ చేయటం తెలిసిందే. రాష్ట్ర హోమ్ మంత్రి చినరాజప్ప వంశీ కేసుపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకు వెళుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, తప్పు చేసినట్లు విచారణలో తేలితే శిక్ష తప్పదని కూడా అన్నారు. సాధారణంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దానికి అర్థం పోలీసులు చర్యలు తీసుకోవటం ఖాయమని అందరకూ తెలిసిందే. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఇళ్ళ తొలగింపు వివాదంపై శరవేగంగా స్పందించటం విశేషం. మామూలుగా రాష్ట్రస్థాయి పెద్ద వివాదాలకే జగన్ బాగా ముదిరిన తర్వాతగానీ వెళ్ళరు. మరి నిన్నటి స్థానిక వివాదానికి జగన్ స్పందించిన తీరు చూస్తే వంశీ ఆందోళనకు మద్దతుగా నిలబడటానికే అన్నట్లుగా కనబడుతోంది. వంశీ గతంలో జగన్ పార్టీలోకి జంప్ చేయాలని ఉవ్విళ్ళూరిన సంగతి తెలిసిందే. జగన్ ఒక సందర్భంలో విజయవాడ వచ్చినప్పుడు ఆయనను కలవటానికి బెంజ్ సర్కిల్ దగ్గర చాలా సేపు వేచి చూసి మరీ వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. ఈ పరిణామంలో ఇంకో అవకాశంకూడా ఉంది. వంశీ వైసీపీలోకి వెళ్ళిపోతాడని తెలిసే ప్రభుత్వం అతనిపై కేసులు పెట్టి ఉండొచ్చు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇవాళ మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోతానని చెప్పిన వంశీ అలా చేయలేదు. కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వంశీ ఇలా అధికారపార్టీలోనే విపక్ష సభ్యుడిలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారిన హోటల్ దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని బాజిది కావటం విశేషం. బాజి ప్రస్తుతం తెలుగుదేశంలోనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close