భూమా ఏడ్చిన విషయాన్ని గుర్తు చేసిన ‘సాక్షి’

హైదరాబాద్: ఎంతైనా వైసీపీకి చెందిన ఐదుగురు ప్రజాప్రతినిధులు వెళ్ళటం ఆ పార్టీ కరపత్రిక సాక్షికి కంటగింపుగానే ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడుపై, పార్టీ ఫిరాయించిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలపై సాక్షి ఇవాళ నిప్పులు చెరిగింది. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డిని విమర్శిస్తూ ఒక వార్త ఇచ్చింది. భూమా గతంలో టీడీపీనుంచి బయటకొచ్చినపుడు చెప్పిన మాటలను ఆ వార్తలో గుర్తుచేసింది. టీడీపీలో తమకు అవమానం జరిగిందంటూ నాడు చంద్రబాబు నాయుడువద్ద ఏడ్చినట్లు భూమా చెప్పారని రాసింది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదని, కనీసం ఓదార్చను కూడా ఓదార్చలేదని భూమా అన్నట్లు పేర్కొంది. పార్టీకోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసినా దగ్గరకు తీసుకోలేదని, ప్రతిదానికీ రాజకీయం చేశారని, పార్టీలో సిన్సియర్‌గా పనిచేస్తే దక్కిన గౌరవం ఇదేనని భూమా అన్నట్లు రాసింది. ఇతర పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళితే ఏ పాటి గౌరవం ఉంటుందో నాగిరెడ్డి తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని సూచించింది. మనస్సాక్షి ఉన్న రాజకీయ నాయకులు వేళ్ళమీద లెక్కపెట్టేటంతమంది మాత్రమే ఉంటారని ‘సాక్షి’కి తెలియకపోవటం విచారకరం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close