రఘురామ ఆర్థిక మూలాలపై వైసీపీ కన్ను..!

రఘురామకృష్ణరాజును ఎలాగైనా దెబ్బకొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సానుకూల ఫలితాలు రావడం లేదు. నేరుగా దెబ్బకొట్టినా.. ఆయనను వెనుకడుగు వేసేలా దెబ్బకొట్టడానికి అవసరమైన వ్యూహం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన ఆర్థిక మూలాలపై గురిపెట్టినట్లుగా కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజుకు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇండ్ భారత్‌ పేరుతో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు అనేక అక్రమాలకు పాల్పడ్డాయని.. ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు నేరుగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీకి ఫిర్యాదుచేశారు.

పూర్తి వివరాలతో ఇండ్ భారత్ కంపెనీ రూ. 940 కోట్ల మేర ప్రజాధనాన్ని కొ‌ల్లగొట్టిందని లేఖ పంపారు. ఈ లేఖపై విజయసాయిరెడ్డితో సహా 15మంది ఎంపీలు సంతకాలు చేశారు. వైఎస్ హయాంలో ఆర్థికంగా ఎదిగిన వైఎస్ ఆత్మీయ పారిశ్రామికవేత్తల్లో రఘురామ ఒకరు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మ అని పేరు పొందిన కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు. ఇండ్-భారత్ పేరుతో పలు కంపెనీలు పెట్టి.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సీబీఐకేసులు కూడా నమోదయ్యాయి. వీటి గురించి… విజయసాయిరెడ్డికి పూర్తిగా తెలుసు. ఆయన సలహాలు.. సూచనలు కూడా రఘురామ వ్యాపార ప్రస్థానంలో ఉన్నాయని చెబుతూంటారు. అయితే.. రఘురామ వ్యాపారంలో జరిగిన సీక్రెట్లన్నీ సీబీఐ కేసులు..విచారణలతో వెలుగులోకి వచ్చాయి.

అవన్నీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌తో పాటు కోర్టుల్లోనూ ఉన్నాయి. బ్యాంకులు కూడా న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇందులో కొత్తవేమీ లేదు. అయితే ఇప్పుడు నేరుగా రాష్ట్రపతి, ప్రధానికి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడం వెనుక.. ఆయనపై మరింత ఒత్తిడి పెంచే వ్యూహం ఉందని అనుమానిస్తున్నారు. ఎలాగైనా ఆయనను కట్టడి చేయాలనుకుంటున్న వైసీపీకి ఇదో అస్త్రం అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close