ఢిల్లీ లాయర్లకు రూ. 4 కోట్ల 67 లక్షల ప్రజాధనం..!

ఏపీ ప్రజాధనం దాదాపుగా రూ. నాలుగు కోట్ల అరవై ఎడు లక్షల రూపాయలను ఢిల్లీ లాయర్లకు ఫీజుగా చెల్లించింది ప్రభుత్వం. ఈ మేరకు నిధులు విడుదల చేసి.. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు ఆదేశాలిచ్చింది. చెల్లింపులు చేయాలని చెప్పింది. జీవోలో మాత్రం చెల్లింపులు ఏ యే లాయర్లకు ఎంత మొత్తం చెల్లించాలన్నదానిపై వివరాలు లేవు. వాటిని రహస్యంగా ఉంచారు. నెల వారీగా రాష్ట్రంలో హైకోర్టులో వాదించే లాయర్ల కోసం విడిగా జీవోలిస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన జీవో కేవలం ఢిల్లీలో అంటే సుప్రీంకోర్టులో వాదించే లాయర్ల కోసమన్నమాట.

ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు హైకోర్టులో వీగిపోతున్నాయి. అత్యధిక సార్లు సుప్రీంకోర్టుకు వస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద లాయర్లను మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం తరపున అయినా… మరో విధంగా అయినా ప్రముఖ లాయర్ల ఫీజులు.. గంటల్లో వసూలు చేస్తారు. అది లక్షల్లో ఉంటుంది. ఇలా ప్రముఖ లాయర్లనే ఏపీ ప్రభుత్వం మాట్లాడుకుంది. రాజధాని అంశం నుంచి … అన్ని కేసుల్లోనూ సుప్రీంకోర్టుకు వచ్చింది. ఇలా వాదించినందుకు.. లాయర్లకు బిల్లులు రూ. కోట్లకు చేరాయి. ఇప్పుడు వాటిని వాదించాల్సి వచ్చింది. ఇంతా చేసి ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పుల్ని ఆ లాయర్లు తీసుకొచ్చారా అంటే అదీ లేదు.. ప్రభుత్వానికి ఇప్పుడే బుద్ది వచ్చింది.. పిటిషన్లు ఉపసంహరించుకుంటామని కొన్ని కేసుల్లో వాదించాల్సి వచ్చింది.

ప్రభుత్వానికి న్యాయసలహాదారులు ఉన్నారు. ఆ పేరు లేకపోయినా అన్ని అంశాల్లో వేలు పెట్టే సలహాదారులు ఉన్నారు. నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారో.. ముఖ్యమంత్రి చెప్పిన మేరకు నడుచుకుంటారో కానీ… చాలా స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టి వేస్తాయని తెలిసినా .. కింది కోర్టు.. పైకోర్టు.. డివిజన్ బెంచ్ అంటూ కోర్టుల చుట్టూనే తిరుగుతున్నారు కానీ ప్రయోజనం ఉండటం లేదు. లాయర్లకు మాత్రం రూ. కోట్లకు కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అయినా తమ సొమ్మేం పోయింది.. ప్రజాధనమేగా అనుకుంటున్న ప్రభుత్వం… అది తప్పని అనుకోవడం లేదు.. దుబారా అని కూడా అనుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close