బొత్సకు చెప్పరా..? తప్పుడు సమాచారం ఇచ్చి బకరాను చేస్తున్నారా..?

వైసీపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణను ప్రణాళిక ప్రకారంగా నవ్వుల పాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలకు భిన్నమైన ప్రకటనలు చేయమని ప్రోత్సహించి.. ఆ తర్వాత ఆయన మాటలకు విలువ లేనట్లుగా… ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. బొత్స చెప్పిన మాటలకు భిన్నమైన ప్రకటనలు చేసి.. అసలు బొత్సకేం తెలీదని.. ఆయనకు ప్రభుత్వంతో సంబందం లేదన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. తాజాగా అమరరాజా సంస్థ విషయంలో అదే జరిగింది. లాభాలొచ్చే చోటుకు వాళ్లు వెళ్లిపోతున్నారని బొత్స ముందుగా ప్రకటించారు. కానీ తర్వాత అనూహ్యంగా సజ్జల భిన్నమైన ప్రకటన చేశారు.

అమరరాజా కంపెనీని తామే వెళ్లిపొమ్మన్నామని అది కాలుష్య కారక పరిశ్రమ అని సజ్జల వాదించారు. ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి విజయ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి… అమరరాజా సంస్థను తరలించాలని హైకోర్టును కోరామని చెప్పుకొచ్చారు. అయితే బొత్స సత్యనారాయణకు ఈ సమాచారం ఇవ్వలేదు. ఆయన పరిశ్రమల మంత్రి కాదు. కానీ ప్రెస్‌మీట్ పెట్టి… అమరరాజా గురించి మాట్లాడారు. మాట్లాడమని ఆయనకు సమాచారం రాబట్టే మాట్లాడారని.. కానీ ప్రభుత్వమే పంపేస్తోందన్న తమ విధానాన్ని మాత్రం ఆయనకు చెప్పలేదంటున్నారు. దీంతో బొత్స..ప్రభుత్వాన్ని సమర్థిస్తే.. ఆ సంస్థే వెళ్లిపోతోందన్నట్లుగా మాట్లాడారు. కానీ.. తర్వాత సజ్జల భిన్నంగా మాట్లాడటంతో బొత్స మాటలకు విలువ లేకుండా పోయింది.

వైసీపీలో బొత్స సత్యనారాయణకు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఉంది. ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కనీసం ఆయన మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఆయన స్వేచ్చగా సమీక్ష చేసే పరిస్థితి కూడా లేదు. తన శాఖలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు ప్రెస్‌మీట్లు పెట్టాలన్న సమాచారం వస్తే మాత్రమే ఆయన తెర ముందుకు వస్తున్నారు. ఆయన ఎక్కువగా విశాఖలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా బొత్సను రాజకీయంగా నిర్వీర్యం చేస్తున్నారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.దీన్ని ఎదుర్కోవడానికి బొత్స రాజకీయ అనుభవం సరిపోవడం లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close