చేవెళ్ల నుంచే షర్మిల పాదయాత్ర.. ముహుర్తం ఖరారు..!

పార్టీ ఆవిర్భావ సభలో వంద రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల …. ముహుర్తం ఖరారు చేసుకున్నారు. అక్టోబర్‌ 18న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. చేవెళ్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సెంటిమెంట్. ఆయన పాదయాత్రను అక్కడి నుంచే ప్రారంభించారు. అంతే కాదు… ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలను కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించేవారు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన సబితా ఇంద్రారెడ్డిని కూడా వైఎస్ సెంటి్మెంట్‌గా భావించేవారు. తర్వాత ఆ నియోజకవర్గ రిజర్వుడు కేటగిరిలోకి వెళ్లింది.

తండ్రికి ఉన్న సెంటిమెంట్‌ను షర్మిల ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 18 నుంచి పాదయాత్ర ప్రారంభించి నిరాటంకంగా తెలంగాణ మొత్తం చుట్టేయాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. 2013లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేశారు. పోటీగా షర్మిల కూడా .. తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు… మోకాలికి ఆపరేషన్ జరగడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని తర్వాత పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు మరోసారి తన సొంత పార్టీ కోసం పాదయాత్ర ప్రారంభించబోతున్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన షర్మిల అందుకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాదయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇప్పటికే ప్రతి మంగళవారం.. నిరుద్యోగ దీక్థలను షర్మిల ప్రారంభించారు. ఈ సారి అనూహ్యంగా ఉపఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కానీ అక్కడ వైఎస్‌ఆర్ టీపీ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని షర్మిలనే ప్రకటించారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా షర్మిల రాజకీయ పార్టీని సన్నద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్ర ద్వారా అధికారాన్ని చేపడితే అది సంచలనమే అవుతుందనడంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close