హెరిటేజ్ కేసులో కన్నబాబు, అంబటిలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు !

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్లుజారీ అయ్యాయి.హెరిటేజ్‌ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో ఇద్దరిపైనా హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎనాన్‌బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసింది. నిజానికి ఇది మొదటి సారి కాదు. మూడో సారి . అయినా వారు కోర్టుకు హాజరు కావడం లేదు. వారెంట్లను పోలీసులు అమలు చేయడం లేదు.

గతంలో హెరిటేజ్ కంపెనీపై ఇన్ సైడర్ ట్రేడింగ్ అని.. మజ్జిగ ప్యాకెట్లు అని రకరకాల ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు, కన్నబాబు ఎక్కువగా ఈ ఆరోపణలు చేశారు. వీటిపై హెరిటేజ్ సంస్థ కోర్టులో పరువు నష్టం కేసులు నమోదు చేసింది. మొదట్లో ఎన్ని సార్లు విచారణ జరిగినా హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగే విచారణకు తప్పని సరిగా హాజరై వ్యక్తిగత పూచీకత్తు, రూ.5 వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను పాటించలేదు. మార్చిలో జరిగిన విచారణకూ హాజరు కాలేదు. అలా వరుసగా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ హాజరు కావడం లేదు.

గురువారం జరిగిన విచారణకూ ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గైర్హాజరయ్యారు. దీంతో వారిద్దరిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కొసమెరుపేమిటంటే.. హెరిటేజ్ ప్రతినిధులూ విచారణకు హాజరు కావడంలేదు. హెరిటేజ్‌ ప్రతినిధి సాంబమూర్తి కూడా హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబరు 7కి వాయిదా వేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైఎస్ ఫ్యామిలీ స్టోరీలో చెల్లికి అన్ననే విలన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అంటే.. వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చడమే అని జగన్ రెడ్డి అనుకుంటూ...

చైతన్య : టాలీవుడ్ పౌరుషం ఇంతేనా ?

సినీ పరిశ్రమ ఏపీలో లేదు. కానీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూస్తే టాలీవుడ్ లో భాగం అనుకునే ఎవరికైనా పళ్లు పటపట కొరకాలని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close