ఏపీ సెక్రటేరియట్‌లో ఉద్యోగ సంఘ నేతల ధర్నా !

పీఆర్సీ నివేదికను బహిరంగపరిచే వరకూ కదలబోమంటూ ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతలు భైఠాయించారు. అయితే వారు లోపల కాకుండా రెండో బ్లాక్ ముందు ఉన్నరోడ్డుపై కూర్చున్నారు. ఈ రోజు పీఆర్సీ నివేదిను వెల్లడిస్తామన్నారని.. అది వెల్లడించే వరకూ తాము వెళ్లబోమన్నారు. అయితే వారికి సమాధానం చెప్పడానికి ఉన్నతాధికారులు ఎవరూ సచివాలయంలో లేరు. చీఫ్ సెక్రటరీ కూడా లేరు. ఉద్యోగ సంఘాల నేతల ఆందోళన గురించి తెలిసిన సీఎస్ సమీర్ శర్మ.. పీఆర్సీ నివేదిను బహిరంగ పరిచేందుకు అనుమతి కోసం… ముఖ్యమమంత్రి క్యాంపుఆఫీస్ కు వెళ్లారు.

సచివాలయంలో బైఠాయించిన వారిలో బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు వంటివారు ఉన్నారు. వారందర్నీ వెళ్లిపోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు అయితే వారు మాత్రం అక్కడి నుంచి కదలబోమని అంటున్నారు. గత నెలలో ఓ సారి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అక్టోబర్ నెలాఖరు కల్లా పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. దీంతో వారు ధర్నాకు దిగారు.

వీరు ఇలా ధర్నాకు దిగడానికి ముందే ఈ ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా ఉండే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తమ జీపీఎఫ్ నిధులు కూడా ఇవ్వడం లేదని.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చంద్రశేఖర్ రెడ్డి అనే మాజీ ఎన్జీవో నేతకు పదవి ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. ఆయనపై చాలా అక్రమాల ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలా ఉద్యోగ సంఘాల నేతలు పోటీపడి ప్రభుత్వంపై విమర్శలకు ముందుకు వస్తున్నారు. తాము ప్రభుత్వంతో కుమ్మక్కు కాలేదని ఉద్యోగులను నమ్మించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

భారత్ కు అమెరికా వార్నింగ్ ..!!

ఇరాన్ తో చాబహార్ పోర్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇండియాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తో ఏ సంస్థ అయినా, దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని...

తెరపైకి క్రికెటర్ క్యారెక్టరైజేషన్

ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గుర్తున్నాడా? మెరుపు వేగంతో బంతులు వేసే బాలాజీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. ఆయన సీరియస్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపుగా ఆయన స్మైల్ ఫేస్...

పట్టభద్రుల బైపోల్..ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల బెడద..?

లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపైనే నెలకొంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close