సాక్షికి “లోటు బడ్జెట్” ఏర్పడినప్పుడల్లా ఫుల్ పేజీ యాడ్స్ !

సాక్షి దినపత్రికు నెలాఖరుకు వచ్చేసరికి జీతాలు ఇతర ఖర్చుల కోసం డబ్బులు చెల్లించడానికి లోటు ఏర్పడితే వెంటనే ప్రభుత్వ పరంగా ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు నెల్లూరు, రాయలసీమ జిల్లాలు వరదలతో అతలాకుతలం అయిపోతూంటే ప్రభుత్వం ఇసుక గురించి ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. ఎందుకు జారీ చేశారంటే… ఎక్కడైనా కాంట్రాక్టర్లు సిండికేట్ అయి ధర పెంచేస్తే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ నెంబర్లు ఇవ్వడానికట. ఏపీ వ్యాప్తంగా జేపీ పవర్ అనే సంస్థకు ఇసుక కట్టబెట్టి చాలా కాలం అయింది.

ఇప్పుడు ఈ ఇసుక గురించి ఎందుకు సీఎం జగన్ కు గుర్తుకు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ కారణం సాక్షిలో ఆర్థిక వ్యవహారాలు చూసే వారికే తెలిసి ఉండవచ్చు. ఒక్క మెయిన్ ఎడిషన్ ఫుల్ పేజీ మాత్రమే కాదు.. జిల్లాలో పేజీల్లో కూడా యాడ్స్ ఇచ్చారు. మెయిన్ పేజీల్లో యాడ్ చూసిన వారు.. జిల్లా పేజీల్లో యాడ్ చూస్తేనే రేట్ ఎంతో తెలుస్తుందట. ప్రభుత్వం ఐ అండ్ పీఆర్ నుంచి ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తే అన్ని మీడియాలు దాన్ని కవర్ చేస్తాయి. దాని కోసం రూ. కోట్లు తన మీడియా సంస్థలకు వెచ్చించి ప్రకటనలు ఇవ్వాల్సిన పని లేదు.

కానీ ఇక్కడ అజెండా వేరు కాబట్టి ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఓ వైపు ఆర్థికంగా దుర్భర పరిస్థితి.. మరో వైపు వరదలతో అతలాకుతలమవుతున్న ఓ ప్రాంతం అయినా .. ప్రభుత్వ పెద్దలు తమ సొంత ఎజెండా ప్రకారమే వెళ్తున్నారని ఈ ప్రకటనలు నిరూపిస్తున్నాయన్న భావన ప్రజల్లో ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close