ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ హీరోల వరద విరాళాలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు తలా రూ. పాతిక లక్షల విరాళాలు ప్రకటించారు. మిగతా హీరోలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఇంకా వరదలపై స్పందించలేదు. ఆయన సొంత జిల్లా చిత్తూరు తిరుపతిల్లోనూ వరద బీభత్సం సృష్టించింది.

ఆయన కూడా లీడ్ తీసుకుని ఏదైనా పండ్ రైజింగ్ ప్రోగ్రాం చేస్తారనే అంచనాలు ఉన్నాయి. రాయలసీమ వరదలు వచ్చినప్పటి నుండి సినిమా హీరోలు విరాళాలు ఇవ్వలేదని కొంతమంది వైసీపీ నేతలు విమర్శలు ప్రారభించారు. ఓవైపు టిక్కెట్ రేట్లు ఇతర సమస్యలను ప్రభుత్వం సృష్టించి పెద్ద సినిమాలు విడుదల కాకుండా చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ సమయంలో మళ్లీ విరాళాలు అంటూ వెంటబడటంతో టాలీవుడ్ పెద్దల్ని సైతం అయోమయంలో పడేసింది.

అయితే ఏం జరిగిందో కానీ పెద్ద ఎత్తున అందరూ ఒకే సారి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ లోపు ఏపీ ప్రభఉత్వం టిక్కెట్ రేట్లను సవరించిందని.. ఓ వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అయితే రేట్లేమీ సవరించలేదు..అందులో ఉన్నవి గతంలో ఖరారు చేసిన టిక్కెట్ ధరలే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close