ఇక ప్రజలతో కలిసి తెరాసపై పోరాటాలకి రేవంత్ రెడ్డి రెడీ

సాక్షాత్ పార్టీ అధ్యక్షుడుకే పార్టీపై ఆసక్తి, దాని మనుగడపై అనుమానాలు ఉన్నప్పుడు ఇక ఆ పార్టీని రక్షించడం ఎవరి తరం? ఇది తెలంగాణాలో తెదేపాను ఉద్దేశ్యించి ఆ పార్టీ నేతలే అనుకొంటున్నా మాటలు. గ్రేటర్ ఎన్నికలు జరగడమే ఆలస్యం అన్నట్లు తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోయారు. మున్ముందు ఇంకా ఎంతమంది గోడ దూకేస్తారో తెలియదు కానీ చాలా మంది దూకేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని పట్టించుకోకపోయినా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం నిబ్బరం కోల్పోకుండా తెరాసతో ఒంటరి పోరాటం చేయడానికి సిద్దం అవుతుండటం మెచ్చుకోవలసిందే.

ఆయన ఇక నుండి నేరుగా ప్రజల మధ్యకే వెళ్లి స్థానిక సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దం అవుతున్నారు. ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో దత్తత తీసుకొన్న చిన్నముల్కనూరు గ్రామానికి స్వయంగా వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో దాని రూపు రేఖలు పూర్తిగా మారిపోయి ఆ గ్రామం దశ తిరుగబోతోందని అందరూ భావించారు. కానీ అంత సంతృప్తికరంగా అభివృద్ధి జరుగలేదనే సంగతి రేవంత్ రెడ్డి గ్రహించారు.

ఆ తరువాత ఆయన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలబడి వారికి న్యాయం కల్పించడానికి ప్రభుత్వంతో పోరాటానికి సిద్దం అవుతున్నారు. స్థానిక పార్టీ క్యాడర్ ని వెంటబెట్టుకొని ప్రజలతో కలిసి పోరాటాలు చేయడం ద్వారా మళ్ళీ ప్రజల అభిమానం పొంది పార్టీని బలోపేతం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి ఆయనతో పార్టీ నేతలు కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారా లేకపోతే తెరాస వశీకరణ మంత్రానికి లొంగిపోయి తెరాసలో చేరిపోతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close