రఘురామ అనర్హతపై తేల్చేయనున్న ప్రివిలేజ్ కమిటీ !

రాజీనామా చేస్తానంటున్న రఘురామకృష్ణరాజుకు లోక్‌సభ స్పీకర్ షాకిచ్చారు. వైసీపీ ఎంపీ భరత్ ఇచ్చిన అనర్హతా పిటిషన్‌ను లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందుకు పంపారు. నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రివిలేజ్ కమిటీ ముందుకు రఘురామకృష్ణరాజుతో పాటు బెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీ శిశిర్ అధికారి అనర్హతా పిటిషన్ కూడా వెళ్లింది. శిశిర్ అధికారి నేరుగా పార్టీ మారిపోయారు. ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో తృణమూల్ ఆయనపై అనర్హతా వేటువేయాలని పిటిషన్ వేసింది.

రఘురామకృష్ణరాజు ఏ పార్టీలోనూ చేరలేదు. కానీ ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పార్టీని ఎక్కడా విమర్శించడం లేదు. మా సీఎం అంటూ తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. ఇదే కారణంగా చూపిస్తూ.. ఆయన పార్టీని ధిక్కరించారని చెబుతూ వైసీపీ అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ ఫిరాయిస్తేనే అనర్హతా వేటు వేస్తారని.. తాను పార్టీ మారలేదని.. తనపై అనర్హతా వేటు వేయలేరని రఘురామకృష్ణరాజు వాదిస్తున్నారు. తన వాదన కూడా ఇప్పటికే స్పీకర్‌కు ఇచ్చారు. ఒక వేళ ప్రివిలేజ్ కమిటీ మళ్లీ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తే మళ్లీ అదే వాదన వినిపించే అవకాశం ఉంది.

ఇప్పటికే వైసీపీ నేతలకు వచ్చే నెల మొదటి వారం వరకూ రఘురామ చాన్స్ ఇచ్చారు. ఆ లోపు అనర్హతా వేటు వేయించకపోతే రాజీనామా చేసి.. ఉపఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు అనర్హతా వేటుపై నిర్ణయం తీసుకున్నా… ఉపఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. అనర్హతా వేటు వేయకపోతే రాజీనామా.. వేసినా పదవి పోతుంది.అప్పుడు ఉపఎన్నికలు ఖాయం. కానీ అనర్హతా వేటు పడితే.. నైతికంగా రఘురామకు ఎదురుదెబ్బ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close