‘ఆర్‌.ఆర్‌.ఆర్’ సీక్వెల్‌… ఈసారి ఏం చేస్తారో?

సీక్వెల్ క‌థ రాసుకోవ‌డం కూడా… ఓ ర‌క‌మైన స‌వాలే. సూప‌ర్ హిట్ కి సీక్వెల్ అంటూ ఓ క‌థ‌ని ప‌ట్టాలెక్కించ‌డం తేలికే కానీ, దాన్ని జ‌న‌రంజ‌కంగా తీసి, మెప్పించ‌డం మాత్రం చాలా క‌ష్టం. రాజ‌మౌళి ఇప్ప‌టి వ‌ర‌కూ సీక్వెల్ జోలికి పోలేదు. కాక‌పోతే… విజయేంద్ర ప్ర‌సాద్ మాత్రం కొన్ని సీక్వెల్ క‌థ‌లు కొన్ని అల్లుకుంటున్నాడు. విక్ర‌మార్కుడు 2 ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల్లో వుంది. ఈ సినిమాకి ద‌ర్వ‌కుడు మాత్రం… రాజ‌మౌళి కాదు. అలానే… ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కీ సీక్వెల్ ఉంద‌ట‌.

అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ లు యేడాది పాటు… ఇంటికి దూరంగా గ‌డిపారు. వారిద్ద‌రూ అనుకోని ప‌రిస్థితుల్లో క‌లిసి, స్నేహం చేస్తే ఏమవుతుంద‌న్న అంద‌మైన ఊహ‌తో `ఆర్‌.ఆర్‌.ఆర్‌`కి బీజం ప‌డింది. నిజానికి చ‌రిత్ర‌లో ఇలా జ‌ర‌గ‌లేదు. కేవ‌లం విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఫాంట‌సీ మాత్ర‌మే. అల్లూరి, కొమ‌రం వారి వారి దారుల్లో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన‌డానికి బ‌య‌ల్దేర‌డంతో ఆర్‌.ఆర్‌.ఆర్‌…క‌థ ముగుస్తుంది.

ఆర్‌.ఆర్‌.ఆర్ 2 విష‌యానికొస్తే.. అల్లూరి, కొమ‌రం స్వాతంత్ర్య సంగ్రామంలో ఏం చేశార‌న్న‌ది క‌థ అవుతుంది. ఆ ద‌శ‌లో కూడా ఇద్ద‌రూ క‌లిసిన‌ట్టు చూపించాల‌న్న‌ది ఆలోచ‌న‌. అయితే ఈ ఊహ కేవ‌లం పైప్ లైన్ లోనే ఉంది. `బాహుబ‌లి 2`కి కొన‌సాగింపుగా నెట్ ఫ్లిక్స్ కోసం ఓ స్క్రిప్టు త‌యారు చేశారు. అయితే… అది అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. `ఆర్‌.ఆర్‌.ఆర్ 2` ఉంటే… దాన్ని ఓటీటీకి ఇద్దామ‌న్న ఆలోచ‌న వుంది. `విక్ర‌మార్కుడు 2`లానే దీన్ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మ‌రో ద‌ర్శ‌కుడికి అప్ప‌గిస్తార్ట‌. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close