బోర్డు తిప్పేసిన వేల్ఫేర్ .. కానీ కేసుల్లేవ్ !

విశాఖకు చెందిన వైసీపీ నేతల మళ్ల విజయ్ ప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్ గ్రూప్ ఏపీలోనూ పలు చోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ సంస్థపై సీబీఐ కేసులు .. ఇతర చీటింగ్ కేసులు నమోదు కావడంతో మళ్ల విజయ్ ప్రసాద్ ను పలుమార్లు అదుపులోకి తీసుకోవడం.. అరెస్ట్ చేయడం చేశారు. అయితే ఏపీలో ఇంకా కేసులు నమోదు కాలేదు. కానీ వేల్ఫేర్ గ్రూప్ వసూలు చేసిన డిపాజిట్లు మాత్రం చెల్లించడం లేదు. గతంలో నెల్లూరులో వేల్ఫేర్ గ్రూప్ ఆఫీసు మూసి వేసింది. అప్పుడు డిపాజిటర్లు, ఏజెంట్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

కానీ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. తమను మోసం చేశారని పోలీస్ స్టేషన్ వద్దకు డిపాజిటర్లు వెళ్లినా కేసుల్లేవు. తాజాగా గుడివాడలోనూ ఆ కంపెనీ కార్యాలయం మూసివేశారు. డిపాజిట్లు మెచ్యూర్ అయిన వారికి డబ్బులు చెల్లించడం లేదు . దీంతో ఏజెంట్లు, డిపాజిట్ దారుల గుండెల్లో రాళ్లు పడ్డాయి. వారు ధర్నాలకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు కావడం లేదు. దాంతో ఏం చేయాలో తెలియక వారు నానా తంటాలు పడుతున్నారు. వేల్ఫేర్ గ్రూప్ ఓనర్ వైసీపీ నేత కావడంతో కేుసలు నమోదు చేయడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

వైసీపీ నేత అయి అయితే మోసం చేయవచ్చా అని వేల్ఫేర్ గ్రూప్ డిపాజిటర్లు మథనపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి.. రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం దానికి రివర్స్‌లో డరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విశ్వ‌క్‌సేన్ కోసం బాల‌య్య‌

నంద‌మూరి హీరోలంటే విశ్వ‌క్‌సేన్‌కు ప్ర‌త్యేక‌మైన అభిమానం. ఎన్టీఆర్‌కు విశ్వ‌క్ వీరాభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ ప్ర‌స్తావన వ‌చ్చినా, ఊగిపోతాడు. బాల‌కృష్ణ‌తో కూడా మంచి అనుబంధ‌మే ఉంది. విశ్వ‌క్‌సేన్ గ‌త చిత్రానికి ఎన్టీఆర్ గెస్ట్ గా...
video

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ట్రైల‌ర్‌: ఇది మ‌రో ర‌కం సినిమా

https://youtu.be/UY31pDh055o?si=kVsguDvBSdE7xJ5Y 'మాస్ కా దాస్' అనే ట్యాగ్ లైన్‌కి త‌గ్గ‌ట్టుగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న నుంచి వ‌స్తున్న మ‌రో పూర్తి స్థాయి మాస్‌, మ‌సాలా, పొలిటిక‌ల్ ధ్రిల్ల‌ర్‌... 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'....

బీఆర్ఎస్ ను బుక్ చేసిన సీబీఐ మాజీ జేడీ..!?

ఏపీకి రాజధాని లేకపోవడంతో మరో పదేళ్లు హైదరబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ డిమాండ్ పట్ల బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల...

పెళ్లి గేమ్‌లో పాండ్యా హిట్ వికెట్ అయ్యాడా ? తెలివిగా తప్పించుకున్నాడా ?

క్రికెటర్ హార్జిక్ పాండ్యా ఇప్పుడు హాట్ టాపిక్. ముంబైకి కెప్టెన్ గా ఆయన భయంకరమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అదే సమయంలో ముంబై టాప్ ఫోర్ కు చేరుకోలేకపోయింది. ఆ షాక్‌లో ఉండగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close