మంచు ఫ్యామిలీకి డి పట్టా భూములు ! హౌ ?ఎలా ?

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ భూ వివాదంలో చిక్కుకుంది. ఆయన తన సొంత మండలం చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రభుత్వానికి చెందిన భూముల్ని తమపై రాయించుకున్నారని ఆన్ లైన్ చేయించుకున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మోహన్ బాబు పేరుపై రెండున్నర ఎకరాలు, ఆయన పెద్ద కుమారుడు విష్ణుపై దాదాపుగా మరో రెండెకరాల స్థలం ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఆన్ లైన్‌లో నమోదయింది. ఈ వివరాలు ఈ సేవ నుంచి బయటకు వచ్చాయి. ఇందులో ఆయనకు ప్రభుత్వం డి పట్టా ద్వారా ఇచ్చిందని తెలుపుతూ ఉంది. 2015లో ఇలా కేటాయించినట్లుగా రికార్డులలో ఉంది.

డీ పట్టాలంటే ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించుకోమని.. లేదా పొలం సాగు చేసుకోమని ఇచ్చే పట్టారు. సాధారణంగా బడుగు, బలహీనవర్గాలకు ఆదాయ వనరులు లేని వారికి ఇస్తారు. వీటిని అసైన్డ్ ల్యాండ్స్ అని కూడా అనొచ్చు. ఈ భూముల్ని మోహన్ బాబు ఫ్యామిలీకి ఎలా ఇచ్చారు ? ఏ ప్రాతిపదికన ఇచ్చారు ? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు ఇచ్చిందా లేకపోతే సొంతంగా అధికారులతో లాబీయింగ్ చేసుకుని ఆ భూమిని మోహన్ బాబు ఫ్యామీలీ సొంతం చేసుకుందా అన్నది తేలాల్సి ఉంది.

మోహన్ బాబు కుటుంబం ఈ ఆరోపణలపై ఇంత వరకూ స్పందించలేదు. కానీ ఇది తీవర్మైన విషయంగా మారే అవకాశం ఉంది. ఆ భూమి మోహన్ బాబు, ఆయన కుమారుడిపై మారడం అనేది ఎవరి పని అనేది తేలేది క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చి ఉంటే మరింత రాజకీయ వివాదం అవుతుంది. ప్రభుత్వానికి తెలియకుండా అధికారులతో కుమ్మక్కయి ఆ భూమికి పత్రాలు సృష్టించుకుని ఉంటే మాత్రం మోహన్ బాబు ఫ్యామిలీ తీవ్ర ఇక్కట్లలో పడినట్లే అనుకోవాలి.

అయితే ఎవరూ చేయకుండా ఈ భూముల పేర్లు మోహన్ బాబు ఆయన కుటుంబసభ్యుల పేర్లపైకి మారే అవకాశమే లేదు. ఇది ప్రభుత్వ భూములు కాబట్టి ఈ విషయాన్ని ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వాలు విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. దీనిపై మోహన్ బాబు ఫ్యామిలీ స్పందించి వివరణ ఇస్తే అనవసర ప్రచారాలకు తెరపడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close