మోదీకి 2 గంటలే నిద్ర.. మిగతా అంతా పనే !

టీడీపీ అధినేత చంద్రబాబు పదిహేడు గంటలు పని చేస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ నేతల్ని మించి బీజేపీ నేతలు మోదీ గురించి ప్రచారం చేసుకుంటున్నారు. పదిహేడు గంటలు అంటే… మిగతా ఏడు గంటలు ఏం చేస్తారని ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని అనుకున్నారేమో కానీ ఏకంగా ఇరవైరెండు గంటలు ఆయన పని చేస్తారని చెప్పుకుంటున్నారు. మోదీ రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని ఇరవై రెండు గంటలు దేశంకోసం పని చేస్తారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చెప్పారు.

ప్రస్తుతం మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ బీజేపీ కోసం ప్రచారం చేస్తూ… మోదీని ఓ రేంజ్‌లో పొగుడుతున్నారు. అందులోభాగంగా రెండు గంటల నిద్ర విషయంబయటకు వచ్చింది. అంతే కాదు.. ఆ రెండు గంటల నిద్ర కూడా అవసరం లేకుండా… ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారట. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ రెండు గంటలు కూడా దేశం కోసం పని చేయడానికే. దేశం కోసం 24 గంటలు పనిచేయాలని తపిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత పాటిల్ చెబుతున్నారు.

పాటిల్ వ్యాఖ్యలు కాస్త అతిశయోక్తిగా ఉన్నా మోదీ కూడా ఓ సారి తన నిద్ర గురించి చెప్పారు. 2012లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ తాను 3-4 గంటలు మాత్రమే నిద్రపోతానని ఎన్నోఏళ్లుగా అదే అలవాటని పేర్కొన్నారు. ప్రధాని అయిన తర్వాత దాన్ని ఓ గంట తగ్గించుకున్నారని చంద్రకాంత పాటిల్ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ర‌క్త చ‌రిత్ర‌… ఇప్పుడే ఇలా ఉంటే ఫ‌లితాల రోజున ఎలా ఉంటుందో?

ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళనకర పరిస్థితి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ ఏపీలో...

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close