పోలవరం కాంట్రాక్టర్ వర్సెస్ ఇసుక కాంట్రాక్టర్.. పంచాయతీ ఇక సీఎం దగ్గరే !

పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా ఇంజినీరింగ్ ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఎంత ఇష్టమైన కంపెనీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఏపీలో ఉన్న ప్రతి ఇసుక రేణువుపైనా హక్కును పొందిన జేపీ పవర్ వెంచర్స్ లింకులు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు. రెండు కంపెనీలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైనవే. అయితే ఇప్పుడు ఈ రెండు కంపెనీలు పోట్లాడుకుంటున్నాయి. మాకు ఉచిత ఇసుక కావాలనిమేఘా అంటే.. డబ్బులిస్తే తప్ప ఇవ్వబోమని జేపీ సంస్థ తేల్చేసింది. దీంతో పోలవరం పనులు ఆగిపోయాయి.

రివర్స్ టెండింరింగ్‌లో భాగంగా 2019లో మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. ఆ సమయంలో ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరాకు హామీ ఇచ్చిందని మేఘా సంస్థ చెబుతోంది. ఇంత కాలం పోలవరంకు అవసరమైన ఇసుకను ఉచితంగానే తీసుకుంటోంది. అయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఇసుక మొత్తాన్ని జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు ఇచ్చింది. ఆ సంస్థ ఇప్పుడు మేఘా సంస్థకు ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. డబ్బు చెల్లించాలని కోరుతోంది. గత ప్రభుత్వ హయంలో ఉచిత ఇసుక విధానం ఉండేది. ఈ కారణంగా గత ప్రభుత్వంలో పనులు చేసిన నవయుగ సంస్థకు ఇసుక ఇబ్బందులు ఎదురు కాలేదు.

ఏపీలో వైఎస్ఆర్‌సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. పోలవరం హెడ్‌వర్క్స్‌ ప్రాజెక్ట్ లో మిగిలిన పనులుతో పాటు, హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కలిపి రూ.4,359.11 కోట్లకు పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. ఆ తర్వాత వారంలోపే గతంలో ఇసుక ఉచితంగా వచ్చేదని, ఇప్పుడు తన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలని, దీనికి జీఎస్టీ అధికం అని, ఇది టెండర్ డాక్యుమెంట్‌ పరిధిలోకి రాని పని అని, అందుకే అదనంగా 500 కోట్లు ఇవ్వాలని మేఘా లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. అయినా ఇప్పుడు ఉచిత ఇసుకను మేఘా ఎలా తీసుకుంటుందో.. అధికారవర్గాలకూ అంతుబట్టని విషయం. ఈ పంచాయతీ సీఎం దగ్గరే తేలే అవకాశం ఉంది. రెండు కంపెనీలు ఆత్మీయమైనవే కావడంతో సీఎం సులువుగానే పరిష్కరించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close