నెల్లూరు కోర్టులో దొంగతనంపై రాజకీయం !

నెల్లూరు కోర్టులో దొంగతనం అంశం ఏపీలో రాజకీయ కలకలం రేపుతోంది. చోరీ అయిన కేసులోని సాక్ష్యాలు కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఖచ్చితంగా శిక్ష పడే కేసుగా భావిస్తూండటంతో ఎక్కువగా ఆయన వైపే అనుమానంగా చూస్తున్నారు. దొంగలు ఎక్కడైనా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మరీ సాక్ష్యాలు తీసుకెళ్లడం ఏమిటన్న అనుమానం సహంజగానే వస్తుంది. వాటిని మటుకే తీసుకెళ్లి పనికి రాని వాటిని కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ఈ వ్యవహారం న్యాయవర్గాల్లోనూ కలకలం రేపింది.

కాకాణిపై కేసును గతంలోనే వెనక్కితీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని కానీ సాధ్యం కాలేదని ఇప్పుడు దొంగతనం పేరుతో సాక్ష్యాలను మాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగగడం న్యాయవ్యవస్థపై దాడి చేయడమేనని టీడీపీ నేత పయ్యావుల ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలన్నారు. వైసీపీ నేతలు న్యాయవ్యవస్థతో సైతం ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

మరో వైపు కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు మాత్రం ఈ మొత్తం దొంగతనం విషయంలో కుట్ర ఉందని అంటున్నారు. మంత్రి అయిన తర్వాత సాక్ష్యాలను దొంగతనం చేయిస్తే అందరికీ ఆయనపైనే అనుమానం వస్తుందని అలా చేశారని అంటున్నారు. నెల్లూరు అంతర్గత రాజకీయాలు ఈ దొంగతనానికి కారణం అయ్యాయని వారంటున్నారు. ఈ విషయంలో పోలీసులు ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

కోర్టులోనే దొంగతనం జరగడం అంటే పూర్తిగా శాంతిభద్రతలు ఫెయిలయినట్లేనని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరి అనుమానపు చూపులు వైసీపీ పైనే పడుతున్నాయి. దీనిపై వైసీపీ కానీ.. కాకాణి కానీ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close