ఆదికేశవులు కుమారుడి డ్రగ్స్ బిజినెస్ !

వందలు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు డికే ఆదికేశవులనాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్. ఆయనను డ్రగ్స్ కేసులో బెంగళూరు ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోనే ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. అక్కడ కూడా ప్రముఖుడే కావడంతో ఈ వార్త సంచలనం అయింది. ఆయన ఓ అపార్టుమెంట్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూడగా పట్టుకున్నారని తెలు్తోంది. సదాశివనగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు చేసి మరికొంత డ్రగ్స్ పట్టుబడటంతో అర్థరాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత అరెస్ట్ చూపించారు. శ్రీనివాస్‌తో పాటు మరికొందరి ఇళ్లలో కూడా ఎన్‌సీబీ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది.

ఆంధ్ర, కర్ణాటక నేతలకు శ్రీనివాస్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా ఎన్‌సీబీ అనుమానిస్తుంది. ఇక, తెలుగు, రాజకీయ సినీ ప్రముఖులతో శ్రీనివాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన డ్రగ్స్ వినియోగదారా లేకపోతే…నేరుగా వ్యాపారమే చేస్తున్నారా అన్నదానిపై ఎన్సీబీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి , డీకే శ్రీనివాస్ సన్నిహిత మిత్రులని రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది.

డీకే ఆదికేశవులు నాయుడు గతంలో టీడీపీలో ఉండేవారు. ఓ సారి పార్టీని ధిక్కరించి పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన చనిపోయిన తర్వాత వారి కుటుంబం మళ్లీ టీడీపీలో చేరింది. 2014లో డీకే శ్రీనివాస్ నాయుడు తల్లి సత్యప్రభ చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు. 2020లో తిరుమలలో సీఎం జగన్‌ను డీకే శ్రీనివాస్ కలిశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close