ఈ సారి ఆర్జీవీ బుక్కయినట్లే !

ద్రౌపది అని పేరు కనిపిస్తే చాలా మందికి ఒక్కటే గుర్తుకు వస్తుంది. ఆర్జీవీకి అదే గుర్తుకు వచ్చింది. చాలా మంది అలా అనకూడదని మనసులో అనుకుంటారు. కానీ ఆర్జీవీ మాత్రం వేరు కదా. వోడ్కా గొంతులోకి దిగగానే ఫోన్ తీసుకుని ట్విట్టర్ ఓపెన్ చేసి తాను ఏమనుకుంటాడో అది రాసేస్తారు. ఇప్పుడు కూడా అదే చేశారు. భారత కొత్త రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరపున ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. ఆమె గెలుపు లాంఛనమే. అయితే ఆమె ద్రౌపది అయితే .. పాండవులు ఎవరు..? కౌరవులు ఎవరు ? అంటూ ఆర్జీవీ ట్వీట్ చేసేశారు. ఆయన ట్వీట్ చూసి అందరూ ఒక్క సారిగా నిర్ఘాంతపోయారు.

ద్రౌపది ముర్ము జీవితం గురించి.. ఆమె రాజకీయ పయనం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి కామెంట్లు చేయరు. ఆమె ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించి.. చదువంటే తెలియని తెగ నుంచి టీచర్‌గా ఎదిగి.. రాజకీయాల్లోకి వచ్చి గిరిజనుల అభ్యున్నతికి ప్రయత్నించారు. అలాంటి వ్యక్తి గురించి పాండవులు ఎవరు.. కౌరవులు ఎవరు అంటూ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదయింది. ఆయనపై పలువురు బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్‌గా తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది.

ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత విపక్ష పార్టీలు కూడా ఎక్కడా అభ్యంతరకరంగా స్పందించడానికి సిద్ధపడలేదు. ఆమెకు సానుకూలత ఉంది. ఆమెపై అనుచిత వ్యాఖ్యల్ని బీజేపీ హైకమాండ్ క్షమించదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారు కాస్త టైం తీసుకుంటే.. ఈ వ్యాఖ్యలపైననే కాకుండా ఇతర వివాదాలతో ఆర్జీవీని ఓ ఆటాడుకోవడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. పైకి గంభీరంగా కనిపించే ఆర్జీవీకి పోలీసులంటే హడల్. త్వరలో బీజేపీ పెద్దలు సినిమా చూపించడం ఖాయమన్న వాదన ఇప్పటికే వినిపిస్దోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close