చికాగోలో ఘనంగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి మీట్ అండ్ గ్రీట్

మాజీ డిప్యూటీ స్పీకర్ మరియు మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి చికాగో పర్యటన సందర్భంగా ఎన్ ఆర్ ఐ టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ శ్రీ కోమటి జయరాం గారి పర్యవేక్షణలో, స్థానిక టీడీపీ నాయకులు శ్రీ హేమ కానూరు గారి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించగా టీడీపీ అభిమానులు, ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి శ్రీ యుగంధర్ యడ్లపాటి గారు అధ్యక్షత వహించగా, మురళి మేరుగ గారు శాలువాతో బుద్ధ ప్రసాద్ గారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ గారు అభిమానులను ఉద్దేశిస్తూ వర్తమాన రాజకీయాలతో పాటుగా తెలుగు జాతి వైభవాన్ని గుర్తు చేస్తూ అనేక ప్రముఖులు మరియు అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి హయాంలో తెలుగు జాతికి లభించిన గుర్తింపు నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి వరకు ప్రస్తావించడం జరిగింది.

అలాగే ప్రవాసాంధ్రులకి పిలుపునిస్తూ తెలుగు జాతి ఔనత్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ అర్ ఐ టీడీపీ చికాగో ప్రతినిధులు రవి కాకర, చిరంజీవి గల్లా, కృష్ణ మోహన్, హను చెరుకూరి, శివ త్రిపురనేని, వినోజ్ చనుమోలు, రఘు చిలుకూరి, కిషోర్ త్రిపురనేని, పవన్ నల్లమల్ల తదితరులు సమన్వయపరిచి విజయవంతం అవ్వడంలో తోడ్పడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close