వెయ్యో.. రెండు వేల కోట్లో అయితే జగన్ ఇచ్చేవారట… కానీ !

వెయ్యో..రెండు వేల కోట్లో అయితే తానే ఏదో విధంగా సర్దేవాడినని కానీ ఇరవై వేల కోట్లకుపైగా కావాలి కాబట్టి ఆలోచిస్తున్నామని పోలవరం నిర్వాసితులకు పరిహారంపై సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని రెండో రోజుల పోలవరం ముంపు నిర్వాసిత గ్రామాల్లో పర్యటి్తూ వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలు ముంపు గ్రామాల ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పోలవరం అంచనాలను గత ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి భారీగా చెల్లించాల్సి ఉన్నందున పెంచినప్పుడు అదంతా చంద్రబాబే తింటున్నారని.. అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఆరోపించడమే కాదు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదుల ఆధారంగా జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా అంచనాలను కేంద్రం తగ్గించేసింది. అర్ అండ్ ఆర్ ప్యాకేజీతో తమకు సంబంధం లేదని కేంద్రం చెబుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హోదాకు బదులుగా ఇస్తామన్న ప్యాకేజీలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా చేర్చి వంద శాతం ప్రాజెక్టు ఖర్చును భరించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత సీన్ మారిపోయింది. ఏపీ సర్కార్ పోలవరం విషయాన్ని పట్టించుకోకపోవడంతో .. సవరించిన అంచనాలను ఆమోదించకపోగా తగ్గించేసింది. ఇప్పుడు పోలవరం విషయంలో తాము ఇచ్చేదేమీ లేదన్నట్లుగా మాట్లాడుతోంది.

మూడేళ్ల కాలంలో పోలవరం నిధుల విషయంలో జగన్ కేంద్రాన్ని అడిగిందేమీ లేదు. డిమాండ్ చేసింది అసలే లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి పది లక్షలు ఇస్తామని నమ్మించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ పది లక్షల గురించి ప్రస్తావించకపోగా.. ఇప్పుడు హమీై ఇచ్చిన విధంగా ఐదు లక్షలిస్తానని చెబుతున్నారు. అంటే హామీని కూడా మార్చేశారు. జగన్ తీరు చూసి పోలవరం నిర్వాసితులు … హవ్వ అని నోరు నొక్కుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టునే కాదు… నిర్వాసితుల్ని కూడా జగన్ నిండా ముంచారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close