వరద బాధిత ప్రాంతాలవైపు కన్నెత్తి చూడని పవన్ !

రాజకీయం అంటే ప్రజలకు సమస్య వస్తే తాను ఉన్నానని భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రతిపక్ష నేతలకు అయితే అది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటే వారికి ముందుగా తమను పలకరించిన వారే గుర్తొస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏపీలో సీఎం సీటు కోసం తానున్నానని అప్పుడప్పుడూ ప్రకటిస్తున్న పవన్ కల్యాణ్..ప్రజలకు కష్టం వచ్చినప్పుడు పెద్దగా బయటకు రాలేదు. వందేళ్లలో రానంత వరద వచ్చి..గోదావరి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగు రోజుల పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తీసుకెళ్లగలిగినంత సాయం తీసుకుని వెళ్లి బాధితుల్నిపలకరించి.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో..పనులు ఎక్కడ ఆగిపోయాయో.. మళ్లీ తాము వస్తే ఏం చేస్తారో వివరిస్తున్నారు. ఆయన చేసేది రాజకీయమే. అందలో సందేహం లేదు. రాజకీయ నాయకుడు రాజకీయం చేయకుండా ఏం చేస్తారు ? రాజకీయం చేసి ప్రజల మెప్పు పొంది అధికారం చేపట్టాలి. సీఎం జగన్ విపత్తులు వచ్చినప్పుడు జనాన్ని పట్టించుకోరు.

వారం తర్వాత వచ్చి అందరూ బాగున్నారని.. సంతోషంగా ఉన్నారని చెప్పి వెళ్తారు. ఇలాంటి సీఎం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు మరింత అడ్వాంటేజ్ తీసుకుంటే… ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందుకే చంద్రబాబు పర్యటనలు జోరుగా చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఇంత వరకూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనల గురించి ఆలోచించలేదు. జనసేన శ్రేణులు సాయం చేస్తున్నాయని చెబుతున్నారు . కానీ అధినేత వస్తే తప్ప ఆ ఎఫెక్ట్ కనిపించే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close