ఇక ఈవీఎంలపై కేసీఆర్ పోరు !

అదేంటో కానీ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చేశారో అచ్చంగా కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. బీజేపీతో వైరం.. మోదీపై విమర్శలు.. ఇలా అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈవీఎంలపై పోరాటం కూడా కేసీఆర్ చంద్రబాబు తరహాలోనే చేయబోతున్నారు. గత ఎన్నికలకు ముంచు చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ సహా ప్రజాప్రతినిధులంతా ఈవీఎంలపై ఈసీ దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకూ పోరాడారు. కానీ ప్రయోజనం పొందలేకపోయారు.

ఈవీఎంలను మానిప్యులేట్ చేయవచ్చని సాంకేతికంగా నిరూపించేందుకు ప్రయత్నించారు. కానీ అలా నిరూపిస్తామన్న ఓ టీడీపీ నిపుణుడు కేసులు పాలయ్యాడు తప్ప.. వేరే ఏ ప్రయోజనమూ లభించలేదు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి ఈవీఎంలపై కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల మద్దతుతో పోరాడాలని నిర్ణయించుకున్నారు. న్యాయపరమైన పోరాటామా.. రాజ్యాంగపరమైన పోరాటమా.. రాజకీయ పరమైనదా అన్నది తేలాల్సి ఉంది.

అయితే ఈవీఎంల విషయంలో ఓడిపోయే పార్టీలు మాత్రమే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్న ఓ వాదన బలంగా ఉంది. అదే ఈవీఎంలతో గెలిచిన తర్వాత వాటి గురించి పెద్దగా మాట్లాడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మమతా బెనర్జీ కూడా ఘన విజయం సాధించారు. కానీ ఆమె అంతకు ముందు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ ఈవీఎంలపై పోరాటంతో ఏం సాధిస్తారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close